MLA MS Raju: బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా..! ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..
- బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం..
- మాస్ వార్నింగ్ ఇచ్చిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు..
- నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరిక..
MLA MS Raju: తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరించారు.. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడరు… దీంతో, మా వాళ్లు ఆవేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.. అంతేకానీ, బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం.. మీకు, మీ అధినేత కూడా ఇదే మా హెచ్చరిక అంటూ హాట్ కామెంట్లు చేశారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు..
Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ CV ఆనంద్ క్షమాపణలు
Also Read
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
- SBI Bank Robbery Case: ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.5.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
కాగా, సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.. హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక రెడ్డి భర్త వేణు రెడ్డి ఆఫీసు మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఆగ్రహం తెప్పించాయి.. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ! .
మరోవైపు, శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారు.. 2024 పార్టీ ఎన్నికల్లో పార్టీ విజయం.. ఒక కొత్త ఉత్సాహన్ని ఇచ్చింది.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉంటుంది.. భవిష్యత్తులో మరో పార్టీ రాష్ట్రంలో టీడీపీతో తలపడలేదు అని వ్యాఖ్యానించారు.. ఇక, ఎన్టీఆర్ కొడుకుగా నాకు హిందూపురంలో మొదటిసారి అవకాశం ఇచ్చారు.. ఆ తర్వాత నేను చేసిన అభివృద్ధి కారణంగానే మూడు సార్లు గెలిచాను.. ఎన్టీఆర్ కొడుకు అంటే ఒక్కసారి మాత్రమే ఆదరిస్తారు.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేశాను కాబట్టే ఈ విజయం సాధ్యమైందన్నారు..సినిమాలంటే అరవడం, నవ్వడం, ఏడవడం కాదు.. సినిమాలో ఒక పాత్ర చేయడం అంటే ఒక ఆత్మలోకి ప్రవేశించడమే అన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!