Nandamuri Balakrishna: సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు..! బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
- శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..
- జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురన్ని చేయాలి..
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న బాలయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలయ్య.. ఈ రోజు తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అన్న క్యాంటీన్ను ప్రారంభించారు.. స్వయంగా టిఫిన్ వడ్డించారు.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు.. అయితే, ఈ పర్యటనలోనే ఆయన హిందూపురంను జిల్లా కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.. అంతేకాదు.. సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా.. జిల్లా హెడ్ క్వార్టర్ ను హిందూపురం చేయాలంటూ గతంలోనే బాలకృష్ణ ఆందోళన చేపట్టిన విషయం విదితమే.. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలతో మరోసారి సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు తప్పదా? అనే చర్చ నడుస్తోంది.
Read Also: Mahesh Babu: అరాచకం.. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ బాబు..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా… జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో పాత అనంతపురం జిల్లాలో నుండి ఈ జిల్లా ఏర్పడింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిగా నిర్ణయించారు.. అయితే, శ్రీ సత్య సాయి జిల్లాలో పెద్ద పట్టణంగా హిందూపురం ఉంది.. దాంతో.. అప్పటి నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. హిందూపురంను శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. మరి, ఇప్పుడు ప్రభుత్వం కూడా మారడంతో అటువైపు అడుగులు పడతాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!