Gangamma Temple EO Arrested: సంచలనంగా మారిన గంగమ్మ గుడి ఈవో దొంగతనం వ్యవహారం.. ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..
- యర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..
- అనుమతి లేకుండా ఆలయ వెండి ఆభరణాలు, చీరలు తరలింపు..
- నిన్నటి రోజు దొంగతనంగా తరలిస్తున్న పోలీసులకు సమాచారం..
- ఈవోపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు..
- రూ.6.23 లక్షలు విలువ చేసే 6 కేజీల వెండి, 2 గ్రామాల బంగారం, 15 చీరలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangamma Temple EO Arrested: శ్రీ సత్యసాయి జిల్లాలోని గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం సంచలనంగా మారింది.. సీసీ కెమెరాలో గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆలయ ఈవో మురళీకృష్ణ చేసిన దొంగతనం బట్టబయలు అయ్యింది.. తాజాగా బయటపడిన సీసీ కెమెరా దృశ్యాల్లో, ఈవో మురళీకృష్ణ తన భార్యతో కలిసి కార్యాలయంలోకి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లిన తరువాత, తన సతీమణికి ఆలయ దర్శనం చేయించుకురమ్మని అసిస్టెంట్ను బయటకు పంపాడు. ఇదే సమయంలో కార్యాలయం బీరువాలో ఉన్న వెండి నగలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని టేబుల్పై పెట్టి మూటలు కట్టడం వీడియోల్లో రికార్డు అయ్యింది..
Read Also: Palash Muchhal-Smriti Mandhana: మంధాన మధుర జ్ఞాపకాన్ని చెరిపేసిన పలాష్ ముచ్చల్!
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ముందే పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న ఆటో డ్రైవర్ను కార్యాలయంలోకి పిలిపించి, కట్టిన మూటలను ఆటోలో పెట్టించడంతో మొత్తం ఘటన పూర్తయింది. ఈ సంఘటన మొత్తాన్ని సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ చేశాయి.. ఈ విషయమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఈవో మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా ఆలయ ఆభరణాలు తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే, 6.23 లక్షల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరలు పోలీసులు సీజ్ చేశారు.. ఈ ఘటనతో ఆలయ పరిపాలన విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు, స్థానికులు ఆలయ భద్రతా చర్యలపై పునర్విమర్శ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!