Gangamma Temple EO Arrested: సంచలనంగా మారిన గంగమ్మ గుడి ఈవో దొంగతనం వ్యవహారం.. ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..
- యర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..
- అనుమతి లేకుండా ఆలయ వెండి ఆభరణాలు, చీరలు తరలింపు..
- నిన్నటి రోజు దొంగతనంగా తరలిస్తున్న పోలీసులకు సమాచారం..
- ఈవోపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు..
- రూ.6.23 లక్షలు విలువ చేసే 6 కేజీల వెండి, 2 గ్రామాల బంగారం, 15 చీరలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangamma Temple EO Arrested: శ్రీ సత్యసాయి జిల్లాలోని గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం సంచలనంగా మారింది.. సీసీ కెమెరాలో గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆలయ ఈవో మురళీకృష్ణ చేసిన దొంగతనం బట్టబయలు అయ్యింది.. తాజాగా బయటపడిన సీసీ కెమెరా దృశ్యాల్లో, ఈవో మురళీకృష్ణ తన భార్యతో కలిసి కార్యాలయంలోకి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లిన తరువాత, తన సతీమణికి ఆలయ దర్శనం చేయించుకురమ్మని అసిస్టెంట్ను బయటకు పంపాడు. ఇదే సమయంలో కార్యాలయం బీరువాలో ఉన్న వెండి నగలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని టేబుల్పై పెట్టి మూటలు కట్టడం వీడియోల్లో రికార్డు అయ్యింది..
Read Also: Palash Muchhal-Smriti Mandhana: మంధాన మధుర జ్ఞాపకాన్ని చెరిపేసిన పలాష్ ముచ్చల్!
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ముందే పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న ఆటో డ్రైవర్ను కార్యాలయంలోకి పిలిపించి, కట్టిన మూటలను ఆటోలో పెట్టించడంతో మొత్తం ఘటన పూర్తయింది. ఈ సంఘటన మొత్తాన్ని సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ చేశాయి.. ఈ విషయమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఈవో మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా ఆలయ ఆభరణాలు తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే, 6.23 లక్షల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరలు పోలీసులు సీజ్ చేశారు.. ఈ ఘటనతో ఆలయ పరిపాలన విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు, స్థానికులు ఆలయ భద్రతా చర్యలపై పునర్విమర్శ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..