Gangamma Temple EO Arrested: సంచలనంగా మారిన గంగమ్మ గుడి ఈవో దొంగతనం వ్యవహారం.. ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..
- యర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీ కృష్ణ అరెస్ట్..
- అనుమతి లేకుండా ఆలయ వెండి ఆభరణాలు, చీరలు తరలింపు..
- నిన్నటి రోజు దొంగతనంగా తరలిస్తున్న పోలీసులకు సమాచారం..
- ఈవోపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు..
- రూ.6.23 లక్షలు విలువ చేసే 6 కేజీల వెండి, 2 గ్రామాల బంగారం, 15 చీరలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangamma Temple EO Arrested: శ్రీ సత్యసాయి జిల్లాలోని గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం వ్యవహారం సంచలనంగా మారింది.. సీసీ కెమెరాలో గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.. కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆలయ ఈవో మురళీకృష్ణ చేసిన దొంగతనం బట్టబయలు అయ్యింది.. తాజాగా బయటపడిన సీసీ కెమెరా దృశ్యాల్లో, ఈవో మురళీకృష్ణ తన భార్యతో కలిసి కార్యాలయంలోకి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వెళ్లిన తరువాత, తన సతీమణికి ఆలయ దర్శనం చేయించుకురమ్మని అసిస్టెంట్ను బయటకు పంపాడు. ఇదే సమయంలో కార్యాలయం బీరువాలో ఉన్న వెండి నగలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని టేబుల్పై పెట్టి మూటలు కట్టడం వీడియోల్లో రికార్డు అయ్యింది..
Read Also: Palash Muchhal-Smriti Mandhana: మంధాన మధుర జ్ఞాపకాన్ని చెరిపేసిన పలాష్ ముచ్చల్!
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ముందే పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న ఆటో డ్రైవర్ను కార్యాలయంలోకి పిలిపించి, కట్టిన మూటలను ఆటోలో పెట్టించడంతో మొత్తం ఘటన పూర్తయింది. ఈ సంఘటన మొత్తాన్ని సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ చేశాయి.. ఈ విషయమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఈవో మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా ఆలయ ఆభరణాలు తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయితే, 6.23 లక్షల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరలు పోలీసులు సీజ్ చేశారు.. ఈ ఘటనతో ఆలయ పరిపాలన విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు, స్థానికులు ఆలయ భద్రతా చర్యలపై పునర్విమర్శ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!