YS Jagan Nellore Tour: నెల్లూరు చేరుకున్న జగన్.. హరిత హోటల్ దగ్గర ఉద్రిక్తత..
- వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తత..
- వైసీపీ కార్యకర్తల మీద పోలీసుల లాఠిఛార్జ్..
- రోడ్డుపై బైఠాయించిన ల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Nellore Tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు.. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్కు స్వాగతం పలికారు వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు.. ఇక, నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మొదట పరామర్శించనున్న జగన్.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.. అయితే, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు.. మెయిన్ రోడ్డుపైకి వచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి.. వందలాది ప్రజలతో వచ్చిన ప్రసన్నను అడ్డుకున్నారు పోలీసులు.. జై జగన్.. జై ప్రసన్న కుమార్ రెడ్డి.. జగన్, ప్రసన్న నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలతో హోరెత్తించారు యువకులు. దీంతో, ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.. అప్రమత్తమైన పోలీసులు, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.. అయితే, నెల్లూరు చేరుకున్న జగన్..
Read Also: Mrunal Thakur : ‘డెకాయిట్’ టీమ్ ప్లాన్ అదుర్స్.. మృణాల్కు ఎమోషనల్ సర్ప్రైజ్
Also Read
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుండగా.. హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తనతో సహా వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై నిరసనకు దిగారు.. రోడ్డుపై పోలీసుల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నా పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.. ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదంటూ బైఠాయించారు.. తమ అధినేత జగన్ వచ్చేవరకు నిరసన కొనసాగిస్తామంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి.. పోలీసుల వైఖరి సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Sing Geetham OTT Release : ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘సింగ్ గీతం’
-
14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
-
Redmi Turbo 6 Max: రెడ్మీ టర్బో 6 మ్యాక్స్.. 10000mAh బ్యాటరీ, 7-ఇంచెస్ 2K డిస్ప్లేతో వచ్చేస్తోంది!
-
NTR Neel : ‘డ్రాగన్’ ఇంటర్వెల్ ఎపిసోడ్.. నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్
-
Raghava Lawrence: 30వ సినిమాతో రాఘవ లారెన్స్ సర్ప్రైజ్.. కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!