Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Trains: తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఈ మేరకు సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 21, 28 తేదీల్లో తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07481 తిరుపతిలో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. అటు ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ట్రైన్ నంబర్ 07482 సికింద్రాబాద్లో సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:20 గంటలకు తిరుపతి చేరనుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయిచూర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయి.
Special Trains Between Tirupati – Secunderabad @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/d3LvIbfMF1
Also Read
— South Central Railway (@SCRailwayIndia) August 18, 2022
మరోవైపు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే పలు స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. సికింద్రాబాద్-మధురై మధ్య ప్రతి మంగళవారం నడిచే ట్రైన్ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు పొడిగించింది. మధురై-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి బుధవారం రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్-జైపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలును సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు.. అలాగే జైపూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిగించారు.
https://twitter.com/SCRailwayIndia/status/1560235142659973120/photo/1
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!