వడ్డాణం మంత్రికి వచ్చిన కష్టం ఏమిటి…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ లో వడ్డాణం మంత్రి ఎవరా అంటే తెలియని వారుండరు. 2014 లో ఆమె మంత్రిగా పని చేసిన ఆమె వ్యవహారశైలితో మోస్ట్ పాపులర్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారింది. చివరికి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబెట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నారట. ఆ మాజీ మంత్రి కష్టాలేంటి?
పీతల సుజాత.. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత… మంత్రిగా కీలక శాఖలు చూసుకున్న ఆమె ప్రస్తుతం తనరాజకీయ మనుగడపై చాలా టెన్షన్ పడుతున్నారట.పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో 2014లో గెలిచి మంత్రి కుర్చీని సొంతం చేసుకున్న ఆమెతరువాత జరిగిన పరిణామాలతో మంత్రి పదవితో పాటు, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. దీంతో ఆమె సీనియర్లని పట్టించుకోలేదు, క్యాడర్ ని కాపాడుకోలేదు, దీంతో వర్గ విబేధాలతో 2019 ఎన్నికల్లో అక్కడి సీటు కూడా కోల్పోయారు. ఆ స్థానాన్ని అక్కడ పట్టున్న కర్రా రాజారావు కి కేటాయించింది టీడీపీ అధిష్టానం…
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
అయితే, 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో కర్రా రాజారావు ఓటమిపాలయ్యారు.కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో కర్రా రాజారావు మృతి చెందారు. దీంతో చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి పదవి ఇప్పటికి ఖాళీగా ఉన్న పరిస్థితి.క్యాడర్ కూడా స్తబ్దుగా అయ్యారు.దీంతో ఇంచార్జి పదవి కోసం నేతల పైరవీలు కొనసాగుతున్నాయట.
ఈ సమయంలో పోయిన చోటే వెతుక్కోవాలని మాజీ మంత్రి పీతల సుజాత మళ్లీ ఎంటరయ్యారు,. ఇంచార్జ్ కోసం పార్టీ పెద్దల దగ్గర పైరవీలు చేస్తున్నారట. మంత్రి పదవి కట్టబెడితే, వివాదాల్లోకి వెళ్లటమే కాకుండా, నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై నడిపించలేకపోయారు పీతల. ఆ తర్వాత సీటు రాకపోవటంతో పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి, ఆమె సైలెంట్ అయ్యారు. ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇంచార్జ్ పదవి సంగతి తెరపైకి రాగానే… మళ్లీ లైన్లోకి వచ్చిన ఈ మాజీ మంత్రి.. ఫంక్షన్లకు పిలవటమే ఆలస్యం హాజరైపోతున్నారట. వర్గ విభేదాలు, సీనియర్లని కలుపుకోలేకపోవటం వంటి కారణాల తో సీటు కోల్పోయిన పీతల సుజాత కి అధిష్టానం ఆశీస్సులు మళ్లీ ఉంటాయో లేదో చూడాలి.
అయితే చింతలపూజి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అవటం తో ఆశావహులు కూడా చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ జడ్పి చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు కి అధిష్టానం అవకాశం కల్పిస్తుందని ఆయన అనుచరగణం భావిస్తోంది.2019 ఎన్నికల్లో సీటు ఆశించి చివరి క్షణం లో సీటు కోల్పోయిన జయరాజు ఈ సారి ఇంచార్జి పదవి తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అడపాదడపా తిరుగుతూ పీతల సుజాత, కొక్కిరిగడ్డ జయరాజు అధిష్టానం దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు. మరి అధిష్టానం మదిలో మెదిలో ఆ వ్యక్తి ఎవరో కొద్దీ రోజుల్లో తేలనుంది…
తాజావార్తలు
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!