Special Trains: రైల్వే శాఖ గుడ్ న్యూస్.. వేసవి సందర్భంగా 104 ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి సందర్భంగా విహార యాత్రలకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. రద్దీ దృష్ట్యా 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకుళం, మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీలలో సికింద్రాబాద్-ఎర్నాకుళం మధ్య (రైలు నంబర్ 07189) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లు రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8: 15 గంటలకు ఎర్నాకుళం చేరుతాయి.
అటు ఏప్రిల్ నెలలో 2, 9, 16, 23, 30, మే నెలలో 7, 14, 21, 28, జూన్ నెలలో 4, 11, 18, 25 తేదీల్లో ఎర్నాకుళం-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07190) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు రాత్రి 11:25 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతాయి.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఏప్రిల్ నెలలో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మే నెలలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 7, 9 ,11, 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య (రైలు నంబర్ 07067) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు మధ్యాహ్నం 3:50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:10 గంటలకు కర్నూలు సిటీ చేరుతాయి.
ఏప్రిల్ నెలలో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29, మే నెలలో 1, 4, 6, 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29 తేదీల్లో, జూన్ నెలలో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29 తేదీల్లో, జూలై 1న కర్నూలు సిటీ-మచిలీపట్నం మధ్య (రైలు నంబర్ 07068) ప్రత్యేక రైళ్లను నడించనున్నారు. ఆయా రైళ్లు రాత్రి 8 గంటలకు కర్నూలు సిటీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:05 గంటలకు మచిలీపట్నం చేరుకోనున్నాయి.
104 Weekly and Tri Weekly Special Trains between various destinations @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/8l86sr2wOy
— South Central Railway (@SCRailwayIndia) March 19, 2022
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!