Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. కొనుగోళ్లలో ఘరానా మోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులతో కుదిరిన ఒప్పందాన్ని మాత్రం దర్జాగా అమలు చేస్తూ మిల్లర్లు రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద ఈ విషయం చెబుతోన్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందన్నారు.
YSR Sanchara Pashu Arogya Seva: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన జగన్
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
వైసీపీకి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యం మాఫియాపై చేసిన వ్యాఖ్యలకైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రైతులను దోచుకుంటోన్న మిల్లర్లు, అధికారుల లెక్క తేలాల్సిందేనన్నారు. ధాన్యాన్ని రీమిల్లింగ్ చేసే మాఫియాపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఈ-క్రాప్ నమోదులోనే కుంభకోణం జరుగుతోందని చెప్పారని.. ఏకంగా 17 వేల మంది రైతుల ఖాతాలలో చిరునామాలు గల్లంతయ్యాయని సోము వీర్రాజు ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ సూచనలనైనా పరిగణనలోకి తీసుకోవాలని సోము వీర్రాజు కోరారు. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ. 1455 చెల్లించాల్సి ఉండగా రూ. 1200 కంటే తక్కవ చెల్లిస్తున్నారని.. మిల్లర్లు వద్దకు మొత్తం ధాన్యం వెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. ఈ దర్జా దోపిడీ వెనుక ఎవరు ఉన్నారన్నది దర్యాప్తు సంస్ధలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో దోపిడీ విషయం తేలాలంటే సీఎం జగన్ నోరు విప్పాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!