Somu Veerraju: ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు….70 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో లీకేజీకి విద్యామంత్రి బాధ్యత వహిస్తారా…..సీఎం బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 వేల కోట్లు విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. 48 శాతం మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో , 52 శాతం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై 90 వేలు ఖర్చు చేస్తున్నా విద్య తీసికట్టే అన్నట్టుగా ఉందన్నారు.
వైద్యరంగంలో కూడా అదే పరిస్థితి. మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నా…..శవాలు బైక్ లపై తీస్కెళ్లాల్సి వస్తోంది. నెల్లూరులో సెక్యురిటీ గార్డులు వైద్యం చేస్తున్నారట.. కర్నూలులో నాలుగో వంతు వైద్యులు లేరు. అవినీతికి ముందుంటారు….అభివృద్ధికి వెనుకబడి వుంటారు. ఆసుపత్రిలో పరికరాలు నిర్వహణ కాంట్రాక్టు లో అక్రమాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా పనిచేస్తున్నాయి…మంగళగిరి ఎయిమ్స్ కి వెళ్లి చూడండి. రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష లేదన్నారు సోము వీర్రాజు.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
కేంద్రం ఇచ్చిన మందులు మట్టిలో పూడ్చేస్తున్నారు…కొన్ని చోట్ల మందులు లేవు. హెల్త్ పై సీఎం , మంత్రికి భయం, శ్రద్ధ లేవు. ఓ బీ ఫార్మసీ అమ్మాయిని లవ్ జిహాదీ పేరుతో అత్యాచారం, మృతి కేసు పెట్టారు. కాకినాడ ఎమ్మెల్యే బీజేపీ ఎంత అంటారు…కర్నూలు జిల్లాలో పాకిస్థాన్ జిందాబాద్ అంటారు. బీజేపీ ఆందోళనలతో ఆలయాలపై దాడులు తగ్గాయి. చెన్నై లో ఆలయం వేలం వేయాలని చూసారు…బీజేపీ అడ్డుకుంది. ఫ్యామిలీ పార్టీలకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. మోడీ , యోగి లాంటి ప్రభుత్వాలు రావాలన్నారు. టీడీపీ , వైసీపీ హయాంలో హోం మంత్రులకు డీఎస్పీ ని కూడా బదిలీ చేసే అధికారం ఉండదు.
ఏపీలో అభివృద్ధి మోడీ ద్వారానే సాధ్యం. కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది…ఏపీలోను బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సోము వీర్రాజు. బీజేపీ దగ్గర నవరత్నాల కంటే ఎక్కువ రత్నాలు ఉన్నాయి. బీజేపీ పొత్తు జనసేనతోనే. ఒకాయన త్యాగం చేస్తామంటారు…ఏం త్యాగం చేస్తారు? ఏపీలో ఫామిలీ పార్టీలు లేకుండా అద్భుతం జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!