Somu Veerraju: ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు….70 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో లీకేజీకి విద్యామంత్రి బాధ్యత వహిస్తారా…..సీఎం బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 వేల కోట్లు విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. 48 శాతం మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో , 52 శాతం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై 90 వేలు ఖర్చు చేస్తున్నా విద్య తీసికట్టే అన్నట్టుగా ఉందన్నారు.
వైద్యరంగంలో కూడా అదే పరిస్థితి. మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నా…..శవాలు బైక్ లపై తీస్కెళ్లాల్సి వస్తోంది. నెల్లూరులో సెక్యురిటీ గార్డులు వైద్యం చేస్తున్నారట.. కర్నూలులో నాలుగో వంతు వైద్యులు లేరు. అవినీతికి ముందుంటారు….అభివృద్ధికి వెనుకబడి వుంటారు. ఆసుపత్రిలో పరికరాలు నిర్వహణ కాంట్రాక్టు లో అక్రమాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా పనిచేస్తున్నాయి…మంగళగిరి ఎయిమ్స్ కి వెళ్లి చూడండి. రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష లేదన్నారు సోము వీర్రాజు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
కేంద్రం ఇచ్చిన మందులు మట్టిలో పూడ్చేస్తున్నారు…కొన్ని చోట్ల మందులు లేవు. హెల్త్ పై సీఎం , మంత్రికి భయం, శ్రద్ధ లేవు. ఓ బీ ఫార్మసీ అమ్మాయిని లవ్ జిహాదీ పేరుతో అత్యాచారం, మృతి కేసు పెట్టారు. కాకినాడ ఎమ్మెల్యే బీజేపీ ఎంత అంటారు…కర్నూలు జిల్లాలో పాకిస్థాన్ జిందాబాద్ అంటారు. బీజేపీ ఆందోళనలతో ఆలయాలపై దాడులు తగ్గాయి. చెన్నై లో ఆలయం వేలం వేయాలని చూసారు…బీజేపీ అడ్డుకుంది. ఫ్యామిలీ పార్టీలకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. మోడీ , యోగి లాంటి ప్రభుత్వాలు రావాలన్నారు. టీడీపీ , వైసీపీ హయాంలో హోం మంత్రులకు డీఎస్పీ ని కూడా బదిలీ చేసే అధికారం ఉండదు.
ఏపీలో అభివృద్ధి మోడీ ద్వారానే సాధ్యం. కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది…ఏపీలోను బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సోము వీర్రాజు. బీజేపీ దగ్గర నవరత్నాల కంటే ఎక్కువ రత్నాలు ఉన్నాయి. బీజేపీ పొత్తు జనసేనతోనే. ఒకాయన త్యాగం చేస్తామంటారు…ఏం త్యాగం చేస్తారు? ఏపీలో ఫామిలీ పార్టీలు లేకుండా అద్భుతం జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!