Somu Veerraju: ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Fires On AP Govt Over Govt Employees Issue: ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివాళా తీసిన ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగా.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. సలహాదారుకి సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సలహాదారుల జీతాలు, వాళ్ళ విధుల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని.. హామీలు నెరవేర్చడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందన్న ఆయన.. మీరు ధైర్యంతో పోరాడి హక్కులను సాధించుకోండని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల్లా రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ఇదే సమయంలో జనసేనతో పొత్తు కొనసాగుతోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేనతో బీజేపీ కాపురం బాగుందని, జనసేన శ్రేణులు తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వారాహి వాహన ప్రారంభోత్సవంలో బీజేపీతోనే కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జీతాలు వస్తే.. అదే మహాభాగ్యం అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తయారు చేసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలను రాజకీయ పార్టీలుగా చూడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము నమోదు చేసుకున్న ఓట్లు తమ పునాది అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖను ప్రభుత్వం ఆదాయం రాబట్టుకునే వనరుగా మార్చేసిందని ఆరోపించారు. టీటీడీ సహా ఇతర ఆలయాల్లో భారీగా టిక్కెట్ రేట్లను పెంచేసి.. సామాన్యులను భగవంతుడిని దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం వైఫల్యాలు, వ్యతిరేక ఓటును.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా మలుచుకుంటున్నామని తెలిపారు.
Business Headlines 09-03-23: పాకిస్తాన్లో ఆటోమొబైల్ కంపెనీల ప్లాంట్ల మూసివేతలు. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!