Somu Veerraju: ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Fires On AP Govt Over Govt Employees Issue: ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివాళా తీసిన ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగా.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. సలహాదారుకి సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సలహాదారుల జీతాలు, వాళ్ళ విధుల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని.. హామీలు నెరవేర్చడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందన్న ఆయన.. మీరు ధైర్యంతో పోరాడి హక్కులను సాధించుకోండని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల్లా రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
ఇదే సమయంలో జనసేనతో పొత్తు కొనసాగుతోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేనతో బీజేపీ కాపురం బాగుందని, జనసేన శ్రేణులు తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వారాహి వాహన ప్రారంభోత్సవంలో బీజేపీతోనే కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జీతాలు వస్తే.. అదే మహాభాగ్యం అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం తయారు చేసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలను రాజకీయ పార్టీలుగా చూడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము నమోదు చేసుకున్న ఓట్లు తమ పునాది అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖను ప్రభుత్వం ఆదాయం రాబట్టుకునే వనరుగా మార్చేసిందని ఆరోపించారు. టీటీడీ సహా ఇతర ఆలయాల్లో భారీగా టిక్కెట్ రేట్లను పెంచేసి.. సామాన్యులను భగవంతుడిని దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం వైఫల్యాలు, వ్యతిరేక ఓటును.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా మలుచుకుంటున్నామని తెలిపారు.
Business Headlines 09-03-23: పాకిస్తాన్లో ఆటోమొబైల్ కంపెనీల ప్లాంట్ల మూసివేతలు. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!