Site icon NTV Telugu

సోము వీర్రాజు హాట్ కామెంట్స్ !

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మతాలపై హాట్ కామెంట్స్ చేశారు… అన్ని మతాలను ఒకే విధానంతో చూడాలని ప్రభుత్వాన్నికి సూచించిన ఆయన.. కొన్ని మతాలకు సంబంధించిన విషయాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం జరుగుతోందని ఆరోపించారు.. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న ఆయన.. ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో 15 మంది ఉండే సభ్యులను ఎక్కువ చేశారు తప్పితే.. కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు.. మరోవైపు.. అవినీతిపరులను ఇవాళ హిందూ ధార్మిక సంస్థల్లో వేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.. ఈ ప్రభుత్వం యొక్క మతతత్వ పోకడలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు సోము వీర్రాజు.. కాగా, తాజాగా 25 మందితో టీటీడీ కొత్త పాలక మండలి ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఎక్స్‌అఫీషియో, ఆహ్వానులు ఇలా అందరినీ కలుపుకుంటే.. టెక్నికల్‌గా టీటీడీ సభ్యుల సంఖ్య 80కు చేరింది.

Exit mobile version