Minister Botsa Satyanarayana: ప్రతి క్లాస్లో స్మార్ట్ టీవీ అందుబాటులోకి తీసుకువస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి సారించింది అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఉపాధ్యాయులను కోరారు.. ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేసే ఆలోచనను విద్యార్థులు గుర్తించాలన్న ఆయన.. రాబోయే కాలంలో కమ్యూనికేషన్ ఆధారంగా ప్రతి తరగతిలో స్మార్ట్ టీవీ అందుబాటులోకి తీసుకువస్తాం అన్నారు.. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోరు ముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.
Read Also: Gannavaram to Shirdi: షిర్డీ భక్తులకు గుడ్న్యూస్.. గన్నవరం నుంచి విమాన సర్వీసులు
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
మరోవైపు.. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ అనేది నిషిద్ధం అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ర్యాగింగ్ చేస్తే శిక్షతప్పదని హెచ్చరించిన ఆయన.. విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా.. అధ్యాపకులకి చెప్పాలన్నారు.. స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. కాగా, విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో రాష్ట్రవ్యాప్తంగా 260 ప్రభుత్వ పాఠశాల ప్రాజెక్టులను ప్రదర్శించారు.. ఈ ఎగ్జిబిషన్కు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ భాగ్య లక్ష్మి, కమిషనర్ స్వప్నికల్ దినకర్, విద్యాశాఖ అధికారులు.. తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!