ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను సవరించింది.. కాలుష్యాన్ని సృష్టించే వారే ఈ వ్యయాన్ని భరించాలన్న థియరీ ఆధారంగా పెనాల్టీలు వేసేందుకు నిర్ణయం ఈసుకుంది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ. 50 వేలు, రెండోమారు రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది.
Read Also: G-20 Presidency: జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ. 25-50 వేలు జరిమానాతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి 10 రూపాయల చొప్పున పెనాల్టీ విధించనున్నారు.. ఇక, వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులుల వినియోగిస్తే రూ. 2500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా పడనుంది.. దుకాణాలు, సంస్థలు, మాల్స్ లాంటి చోట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే రూ. 20 వేల నుంచి రూ. 40 వేల జరిమానా వసూలు చేయనున్నారు.. అంతేకాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల రవాణా చేస్తే రూ. 25 వేల నుంచి రూ. 50 వేల జరిమానా పడనుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా.. ఎస్ఈబీ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. అంటే నిషేధించిన ప్లాస్టిక్ వాడకుండా ఉంటే తప్ప.. ఉప్పత్తి చేసినా, రవాణా చేసినా, మార్కెట్ చేసినా, వాడినా.. ఇలా అన్ని రకాలుగా జేబుకు చిల్లు పడుతుందన్నమాట.