బీటెక్ విద్యార్ధి రమ్య హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ పేరుతో అమ్మాయిలను బలితీసుకుంటూనే ఉన్నారు దుర్మార్గులు. ఎన్ని శిక్షలు వేసిన ఉన్మాదుల ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పరమాయకుంట. అక్కడికి బైకుపై బీటెక్ విద్యార్థిని రమ్యతోపాటు శశికృష్ణ వచ్చాడు. అప్పటివరకూ బాగానే మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య శశిని వెనక్కి నెట్టి ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది.
Also Read
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
అంతే కిందపడ్డ శశి పైకిలేచి కత్తితో రమ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడినుంచి బైకుపై పరారయ్యాడు. అయినా ఎవరూ యువకుడిని అడ్డుకున్న పాపానపోలేదు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న రమ్య కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే రమ్య ప్రాణాలు విడిచింది. ఈ దారుణం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రమ్య సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం రమ్యకు ఇన్ స్టా గ్రామ్లో గుంటూరుకు చెందిన శశికృష్ణతో పరిచయం ఏర్పడింది.
అప్పుడప్పుడు ఇద్దరూ కలుస్తుండేవారు. ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం కూడా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. రమ్య హత్య సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హోంమంత్రి సుచరితతోపాటు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్ వద్దకు చేరుకుని రమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడికి దిశ చట్టం కింద ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని శిక్షిస్తామని.. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ గౌతం సవాంగ్. మరోవైపు రమ్య కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!