బీటెక్ విద్యార్ధి రమ్య హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ పేరుతో అమ్మాయిలను బలితీసుకుంటూనే ఉన్నారు దుర్మార్గులు. ఎన్ని శిక్షలు వేసిన ఉన్మాదుల ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పరమాయకుంట. అక్కడికి బైకుపై బీటెక్ విద్యార్థిని రమ్యతోపాటు శశికృష్ణ వచ్చాడు. అప్పటివరకూ బాగానే మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య శశిని వెనక్కి నెట్టి ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
అంతే కిందపడ్డ శశి పైకిలేచి కత్తితో రమ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడినుంచి బైకుపై పరారయ్యాడు. అయినా ఎవరూ యువకుడిని అడ్డుకున్న పాపానపోలేదు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న రమ్య కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే రమ్య ప్రాణాలు విడిచింది. ఈ దారుణం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రమ్య సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం రమ్యకు ఇన్ స్టా గ్రామ్లో గుంటూరుకు చెందిన శశికృష్ణతో పరిచయం ఏర్పడింది.
అప్పుడప్పుడు ఇద్దరూ కలుస్తుండేవారు. ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం కూడా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. రమ్య హత్య సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హోంమంత్రి సుచరితతోపాటు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్ వద్దకు చేరుకుని రమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితుడికి దిశ చట్టం కింద ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని శిక్షిస్తామని.. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ గౌతం సవాంగ్. మరోవైపు రమ్య కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తాజావార్తలు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!