NTV Telugu Site icon

Road Accident in AP: ఏపీలో రోడ్డు టెర్రర్‌.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

Accident

Accident

Road Accident in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదలు జరిగాయి. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు ఏడుగురు చనిపోయారు. అయితే, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట దగ్గర నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో.. సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. మృతులు అందరూ అనంతపురంలోని సిండికేట్‌నగర్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Manipur : మణిపూర్‌లో ఆర్మీ, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు స్వాధీనం

మరోవైపు, తిరుపతి జిల్లా చిల్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. నెల్లూరు నగరం వనంతోపు ప్రాంతానికి చెందిన భక్తులు తమిళనాడులోని అరుణాచలంకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ముందు వెళ్తున్న కంటైనర్ ను వేగంగా వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. గాయపడిన వారిని గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.