Senior Journalist Gopal Reddy: ఘాట్ రోడ్డులో ప్రమాదం.. సీనియర్ జర్నలిస్ట్ మృతి
Senior Journalist Gopal Reddy Died In Tirupati Ghat Road Accident: తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో చోటు చేసుకున్న ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి (75) మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం గోపాల్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని డీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆయన అక్కడకక్కిడే చనిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బ్రహ్మోత్సవ కవరేజ్లో పాల్గొన్నారు. అది ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగింది. గోపాల్ రెడ్డి మృతితో జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. గోపాల్ రెడ్డి నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో తనదైన ముద్ర వేశారని, ఎందరో యువ జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. గోపాల్ రెడ్డి ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తన అక్షర ఆయుధాలతో ఆయన అనేక సమస్యలపై పోరాటం చేశారన్నారు. గోపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు.. గోపాల్ రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద దిక్కు ఇక లేడన్న విషయం తెలిసి, కన్నీటిపర్యంతమవుతున్నారు. అటు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢీ కొట్టిన ఆ వాహనాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!