ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకోసం పనిచేసే సీఎంకు అందరూ మద్దతుగా నిలబడాలన్నారు. కొన్ని దుష్ట శక్తులు పన్నాగాలతో సీఎం వైఎస్ జగన్పై కుట్రలు చేస్తున్నాయన్నారు. బాపట్ల ప్రజలకి, దేవుడికి, సీఎం వైఎస్ జగన్కి రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్ , నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గతేడాది కోవిడ్ కారణంగా క్రిస్మస్ నిర్వహించుకోలేకపోయామన్నారు. వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కోవిడ్ అడ్డుకట్ట పడలేదన్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చేదు జ్ఞాపకాల నుంచి తేరుకుని తగిన జాగ్రత్తలతో పండగలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ లో పుట్టిన వారిలో మేజిక్ ఉన్నట్టుంది…సమాజ పరివర్తన తీసుకురావడంలో ముందుంటారన్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా డిసెంబర్ 21న పుట్టారన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఆయన పై అసెంబ్లీలో ఎంతలా తప్పుగా మాట్లాడినా ఆయన దేవుడినే నమ్ముకున్నారన్నారు. విద్యార్థులకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తే కొందరూ దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వం మాదేనని చెప్పారు. మీ అందరి ప్రార్థనల వల్లే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. క్రైస్తవుల అవసరాలు తీర్చడానికి… భద్రతకి మా ప్రభుత్వం అండగా ఉంటుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించాలని ఆదిమూలపు సురేష్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!