ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకోసం పనిచేసే సీఎంకు అందరూ మద్దతుగా నిలబడాలన్నారు. కొన్ని దుష్ట శక్తులు పన్నాగాలతో సీఎం వైఎస్ జగన్పై కుట్రలు చేస్తున్నాయన్నారు. బాపట్ల ప్రజలకి, దేవుడికి, సీఎం వైఎస్ జగన్కి రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్ , నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గతేడాది కోవిడ్ కారణంగా క్రిస్మస్ నిర్వహించుకోలేకపోయామన్నారు. వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కోవిడ్ అడ్డుకట్ట పడలేదన్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చేదు జ్ఞాపకాల నుంచి తేరుకుని తగిన జాగ్రత్తలతో పండగలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ లో పుట్టిన వారిలో మేజిక్ ఉన్నట్టుంది…సమాజ పరివర్తన తీసుకురావడంలో ముందుంటారన్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా డిసెంబర్ 21న పుట్టారన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఆయన పై అసెంబ్లీలో ఎంతలా తప్పుగా మాట్లాడినా ఆయన దేవుడినే నమ్ముకున్నారన్నారు. విద్యార్థులకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తే కొందరూ దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వం మాదేనని చెప్పారు. మీ అందరి ప్రార్థనల వల్లే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. క్రైస్తవుల అవసరాలు తీర్చడానికి… భద్రతకి మా ప్రభుత్వం అండగా ఉంటుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించాలని ఆదిమూలపు సురేష్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!