Rajahmundry Sanitation: చారిత్రక నగరానికి ముంపు ముప్పు.. తప్పెవరిది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేరుకే చారిత్రకనగరం.. కానీ అక్కడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు ముందు చూపు కొరవడింది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రాజమండ్రి నగరం ముంపునకు గురౌతుంది. అక్కడ వర్షం వస్తే చాలు నగరం చిత్తడవుతుంది. వేసవిలో చేపట్టవలసిన డ్రైనేజీల్లో పూడికతీత పనులు ఆలస్యంగా చేపట్టి , వర్షాలు పడటంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు అధికారులు, కార్పోరేషన్ సిబ్బంది. వర్షాలు పడుతుండడంతో అంటువ్యాధుల భయం జనాన్ని పీడిస్తోంది.
చారిత్రక నగరం రాజమహేంద్రవరం చెత్తా చెదారం పెరిగి ముంపుతో కంపుకొడుతుంది. రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ప్రతిఏటా వేసవిలో డ్రైనేజీల్లో పూడిక తీత పనులను చేపట్టేవారు. కానీ ఈ ఏడాది ఆ పనులేం కనిపించలేదు. ఈనెల15వ తేదీ తరువాత నుండి పూడికతీత పనులను చేపట్టారు. ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీల్లో మురికి నీరు పొంగిపొర్లుతూ రోడ్లుపై ప్రవహిస్తోంది. చిన్నపాటి చినుకులకే పలు ప్రాంతాల్లో రోడ్లుచెరువులను తలపిస్తున్నాయి.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
హైటెక్ బస్టాండ్, రైల్వే స్టేషన్, అదెమ్మదిబ్బ, వి.ఎల్. పురం, మోరంపూడి.,..తదితర ప్రాంతాలు వర్షాలు వస్తే ముంపునకు గురౌతున్నాయి. వర్షం వస్తే చాలు ఈ ప్రాంతవాసులు భయపడి పోతున్నారు. వాహనాలు మొరాయించి మరమ్మతులకు గురౌతున్నాయి. వర్షాలు పడటంతో మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. క్లీన్ రాజమండ్రి పేరుతో శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితోపాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు డ్రైవ్ లోపాల్గొని డ్రైనేజీలు శుభ్రపర్చే కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రోజుకు మూడు డివిజన్లు చొప్పున 16 రోజుల్లోనే రాజమండ్రి అంతా శానిటేషన్ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమాలను ఎంపీ మార్గాని భరత్, ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
Ponds Controversy: ఎండపల్లిలో చెరువుల వివాదం .. టెన్షన్ టెన్షన్
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!