Chandrababu and Pawan Kalyan: పవన్, చంద్రబాబు ఏం చర్చించారు..? సీట్లు, ఓట్లు గురించా..? ప్యాకేజ్పైనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవసరం లేదు.. ఎందుకంటే.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారు.. కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనంటూ ఆరోపణలు గుప్పించారు.ర. తమ అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు నిన్న సమావేశం అయ్యారని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు చేసిన పనులను పవన్ ఖండించాలి.. కానీ, ఆ పని ఎప్పుడూ జరగదని విమర్శించారు. పవన్, చంద్రబాబు మీటింగ్ కోసం వీళ్లే అన్ రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.. చంద్రబాబు సిద్ధాంతాలు ఏవి నచ్చి మద్దతు ఇస్తున్నారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Sri Krishnarjuna Yuddhamu: ఆరు పదుల ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ఇక, పవన్, చంద్రబాబు ఏం చర్చించారో ఎందుకు బయట పెట్టరు.. ? అని నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుకున్నారా? ప్యాకేజ్ గురించి చర్చించారా? అంటూ సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరెవరు కలిసి పోటీ చేస్తారో, కన్ఫ్యూజన్ త్వరగా తొలగిపోవాలనే మేం కోరుకుంటున్నామన్న సజ్జల.. ఇంతమంది కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దింపి.. చంద్రబాబుని అధికారంలోకి కూర్చోబెట్టాలి అనేదే అజెండా పెట్టుకున్నారని ఆరోపించారు. పగటి వేషగాళ్లు వస్తున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఈ విషయాలన్ని అర్ధం అవ్వాలనే పవన్-బాబు మీటింగ్ పై ఇంత మంది నాయకులు స్పందించారని చెప్పుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన పొత్తు పై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలు ఐదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారు.. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రహస్యంగా ఎందుకు సమావేశాలు అవుతున్నారు? తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.. చంపినవాళ్లను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? 11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని పవన్ కల్యాణ్ పరామర్శించటం ఏంటి అని విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?