Sajjala Ramakrishna Reddy: ఈ ఏడాదిలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో లేవు కాబట్టి తన క్యాడర్ను కాపాడుకోవడానికి త్వరలో ఎన్నికలు వస్తున్నాయంటూ చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఆయనకు ప్రజల్లో బలం లేదని.. ఇంకో నటుడి వల్ల ఓట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ ఉంటేనే నాయకులు నిలబడతారనే భ్రమలో ఉంచుతున్నారని.. బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరినీ కలిపి జగన్ను అధికారంలో నుంచి దించాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల ఆరోపించారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. మూడు రాజధానులను తమను గెలిపించే ఎజెండాగా తాము చూడటం లేదని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి నిర్మాణంలో అధిక నిధులు ఖర్చు పెట్టలేక సమగ్రాభివృద్ధి అని మూడు రాజధానులు అంటున్నామన్నారు. వేల కోట్లు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలనుకున్న చంద్రబాబు బినామీల ఆలోచనలు సాధ్యం కాలేదన్నారు.
Also Read
Read Also: Gudivada Amarnath: అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం కరకట్ట వేయలేకపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడని.. గత మూడున్నరేళ్లలో తాము ప్రజాస్వామ్య విలువలు పెంచామని గుర్తుచేశారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు అవసరమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టి తీరుతామన్నారు. బండ బూతులు తిట్టే రాజకీయ నాయకులకు వైసీపీ యువత బుద్ధి చెప్పాలన్నారు. యువత అసభ్య పదజాలం వాడొద్దని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. జగన్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు పనిచేయాలన్నారు. తప్పుడు మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలు తమ ఇంట్లో మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేశామని.. గతంలో విదేశీ విద్య దుర్వినియోగం అయ్యిందన్నారు.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..