Sajjala Ramakrishna Reddy: ఈ ఏడాదిలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తాం
Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో లేవు కాబట్టి తన క్యాడర్ను కాపాడుకోవడానికి త్వరలో ఎన్నికలు వస్తున్నాయంటూ చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఆయనకు ప్రజల్లో బలం లేదని.. ఇంకో నటుడి వల్ల ఓట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ ఉంటేనే నాయకులు నిలబడతారనే భ్రమలో ఉంచుతున్నారని.. బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరినీ కలిపి జగన్ను అధికారంలో నుంచి దించాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల ఆరోపించారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. మూడు రాజధానులను తమను గెలిపించే ఎజెండాగా తాము చూడటం లేదని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి నిర్మాణంలో అధిక నిధులు ఖర్చు పెట్టలేక సమగ్రాభివృద్ధి అని మూడు రాజధానులు అంటున్నామన్నారు. వేల కోట్లు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలనుకున్న చంద్రబాబు బినామీల ఆలోచనలు సాధ్యం కాలేదన్నారు.
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
Read Also: Gudivada Amarnath: అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం కరకట్ట వేయలేకపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడని.. గత మూడున్నరేళ్లలో తాము ప్రజాస్వామ్య విలువలు పెంచామని గుర్తుచేశారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు అవసరమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టి తీరుతామన్నారు. బండ బూతులు తిట్టే రాజకీయ నాయకులకు వైసీపీ యువత బుద్ధి చెప్పాలన్నారు. యువత అసభ్య పదజాలం వాడొద్దని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. జగన్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు పనిచేయాలన్నారు. తప్పుడు మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలు తమ ఇంట్లో మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేశామని.. గతంలో విదేశీ విద్య దుర్వినియోగం అయ్యిందన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!