Sajjala Ramakrishna Reddy: వరదల్లోనూ చంద్రబాబు ఫోటో విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy comments on chandrababu: వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని.. చంద్రబాబు మురికి రాజకీయానికి గురువారం నాటి ఘటనే సాక్ష్యమన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలే లేవని సజ్జల విమర్శించారు.
Read Also: South Central Railway: ప్రయాణికులకు గమనిక.. పలు మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఆసాంతం పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఏ ఒక్కరితో కూడా చెప్పించలేకపోయారని సజ్జల అన్నారు. సాయం అందలేదనే మాట ఒక్కరి నోటి నుంచి కూడా రాని పరిస్థితి కనిపించిందన్నారు. 40ఏళ్ల చంద్రబాబు అబద్ధపు రాజకీయ జీవితం ఆఖరి దశకు చేరిందని సజ్జల విమర్శలు చేశారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో పార్టీలకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగిందని.. నిర్దేశిత కాలపరిమితిలో మండల కమిటీలు వేసుకోవాలని సీఎం జగన్ సూచించారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో నేరుగా జగన్ మాట్లాడతారన్నారు. గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేరవేస్తున్నామన్నారు. తమప్రభుత్వంలో లంచం అనేదే లేకుండా నేరుగా లబ్దిదారులకు డీబీటీల ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని తెలిపారు. గతంలో ఏం జరిగింది.. ఈ మూడేళ్లల్లో ఏం జరిగిందనే అంశాన్ని బేరీజు వేసుకుంటే ప్రతి ఒక్కరూ జగన్ వైపే వస్తారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రాఫిక్స్, మోసం ద్వారా మభ్య పెట్టిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ప్రతిపక్షం బురద జల్లుతోందని మండిపడ్డారు. బటన్ నొక్కగానే డబ్బులు ఖాతాల్లోకి వెళ్తున్నాయని.. ఈ తరహాలో బటన్ నొక్కే విధానం గతంలో ఎన్నడూ లేదన్నారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!