Sajjala Ramakrishna Reddy: రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్.. టార్గెట్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అందులో భాగంగా ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి ప్రజాప్రతినిధులు వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో చేకూర్చిన లబ్ధిని తెలియజేస్తున్నారు. ఇక, మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ జరుగుతందని తెలిపారు. మా పార్టీ సైనికులు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ఏడు లక్షల మంది.. 14 రోజుల్లో కోటి 80 లక్షల ఇళ్లను సందర్శిస్తారు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా వెళ్తారు.. 10 నిమిషాల పాటు వారితో మాట్లాడతారు.. వైఎస్ జగన్ తరపున ప్రజల నుంచి మద్దతు కోరతారు.. గత ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు మీకు జరిగిన లబ్ది ఏంటి? అని అడుగుతారు వెల్లడించారు.
Read Also: Actor Akanksha Dubey Case: భోజ్పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
Also Read
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్లో ప్రజా మద్దతు పేరుతో ప్రజా అభిప్రాయం సేకరిస్తారని తెలిపారు సజ్జల.. ముఖ్యంగా ఐదు ప్రశ్నలు వేస్తారు.. దీనిలోనే జగన్ పట్ల ప్రజా మద్దతు తెలిసిపోతుందన్న ఆయన.. 82960 82960 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని అడుగుతారు.. వారికి సీఎం వైఎస్ జగన్ వాయిస్ తో ధన్యవాదాల మెసేజ్ వెళ్తుందన్నారు. ఇక, అభ్యంతరం లేకపోతే ఇంటికి, మొబైల్ ఫోన్ కు పెట్టుకోవటానికి స్టిక్కర్ ఇస్తారని పేర్కొన్నారు. ఇంత వరకు ఇంత విస్తృతంగా ప్రతి గడపను తట్టే విధంగా ప్రజా మద్దతును కోరే రాజకీయ కార్యక్రమం జరుగలేదన్న సజ్జల.. దీంతో.. ప్రతిపక్షాల నోళ్లు మూతబడతాయన్నారు.. మన శరీరంలో నాడీ వ్యవస్థలా పార్టీకి కీలకమైన పాత్రను గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వ్యవహరించనున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీలపై మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులో సవాలు చేశాం.. టీడీపీ జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా పీల్చారని మండిపడ్డారు.. కానీ, మా వాలంటీర్ వ్యవస్థ పారదర్శకంగా పథకాలను ప్రజలకు అందిస్తోంది.. ప్రభుత్వం, అధికార పార్టీ ఒకటే అని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!