పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు పట్టుదలగా వున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడంతో కీలకంగా మారింది.
ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర వహిస్తారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ చేపట్టబోయే అన్ని రకాల ఆందోళనకు పూర్తిగా మద్దతిస్తున్నాం అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వంలో విలీనంచేస్తే మంచి జరుగుతుందనుకున్నాం. కానీ విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే విలీనం ఇదేనా అనిపిస్తోంది. రివర్స్ పీఆర్సీ వల్ల జీతాలు తగ్గే పరిస్థితి ఎదురైందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.