పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా పడింది. అశ్వారావుపేట పేట నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరో 10 కిలో మీటర్లు వెళ్తే బస్సు జంగారెడ్డిగూడెం చేరుకుంటుంది అనే సమయంలో డీవైడర్ ను ఢీ కొట్టి జల్లేరు వాగులో బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఏడు మృతి మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బస్సు వాగులో ఒకవైపుకు పడటంతో ప్రయాణికులు ఒక్కరి పై ఒక్కరు పడ్డారు. దాంతో వారికీ తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయాలతో బయటపడగా… కండక్టర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.