Tirupati: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రిజిస్ట్రేషన్ల ఆలస్యంపై ఆరా
- రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
- రిజిస్ట్రేషన్ల ఆలస్యం, ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో తీవ్ర జాప్యంపై ఆరా..
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: తిరుపతిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో పనుల జాప్యంపై వరుసగా ఫిర్యాదులు అందడంతో, కలెక్టర్ స్వయంగా అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా క్రయ- విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్లలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. అయితే, ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు కలెక్టర్ దృష్టికి వచ్చింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే కార్యాలయంగా గుర్తింపు పొందినదని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు.
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
అయితే, రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ, సిబ్బంది కొరతతో పాటు సాంకేతిక లోపాల కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు కలెక్టర్ వెంకటేశ్వర్లకు తెలిపారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆలస్యం, అధిక ఫీజులు, ఆన్లైన్ లోపాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. స్లాట్స్ బుకింగ్, డాక్యుమెంట్ల స్కానింగ్, రిజిస్ట్రేషన్ విధానంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సర్వర్ పనితీరును మెరుగుపర్చాలని, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
ఇక, ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైన చోట అదనపు సిబ్బంది, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..