Tirupati: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రిజిస్ట్రేషన్ల ఆలస్యంపై ఆరా
- రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
- రిజిస్ట్రేషన్ల ఆలస్యం, ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో తీవ్ర జాప్యంపై ఆరా..
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
Tirupati: తిరుపతిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో పనుల జాప్యంపై వరుసగా ఫిర్యాదులు అందడంతో, కలెక్టర్ స్వయంగా అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా క్రయ- విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్లలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. అయితే, ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు కలెక్టర్ దృష్టికి వచ్చింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే కార్యాలయంగా గుర్తింపు పొందినదని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
- Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
- Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
అయితే, రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ, సిబ్బంది కొరతతో పాటు సాంకేతిక లోపాల కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు కలెక్టర్ వెంకటేశ్వర్లకు తెలిపారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆలస్యం, అధిక ఫీజులు, ఆన్లైన్ లోపాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. స్లాట్స్ బుకింగ్, డాక్యుమెంట్ల స్కానింగ్, రిజిస్ట్రేషన్ విధానంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సర్వర్ పనితీరును మెరుగుపర్చాలని, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
ఇక, ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైన చోట అదనపు సిబ్బంది, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!