Relief For TTD EO DharmaReddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట.. రిట్ పిటిషన్ డిస్మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట లభించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కొట్టివేసింది ఏపీ హైకోర్టు. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి నియామకం చెల్లదని రిట్ పిటిషన్ దాఖలు చేశారు నవీన్ కుమార్ రెడ్డి. అయితే, పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేశారు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్. టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా నియమించాలంటే దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవిచేసి ఉన్న సరిపోతుందని హైకోర్టు పేర్కొంది.
ఏవి ధర్మారెడ్డి అర్హతల్లో జిల్లా కలెక్టర్ సమానమైన పదవిని రాష్ట్ర ప్రభుత్వంలో చేయడాన్ని పరిగణనలోకి తీసుకుంది న్యాయస్థానం. దీంతో న్యాయస్థానం రిట్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయనకు రిలీఫ్ లభించినట్టయింది. ధర్మారెడ్డి 1991లో ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఏ సర్వీసెస్ పోస్టులో యూపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యారు. ఆయన్ను డిప్యుటేషన్పై ఆంధ్రకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (DOPT) 2019 జూలై 8న ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మే 14తో ఆ డిప్యుటేషన్ కాలపరిమితి ముగిసిందని పిటిషన్లో నవీన్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
Read Also: TTD: ఆ భక్తుడికి రూ.50 లక్షలు ఇవ్వండి.. టీటీడీకి కోర్టు ఆదేశాలు..
టీటీడీలో ఈవోగా పనిచేసిన జవహర్ రెడ్డి బదిలీ అనంతరం ధర్మారెడ్డికి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. టీటీడీ ఈవో పోస్టు ఖాళీ కావడంతో ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మే 8న జీవో 813 జారీ చేయగా.. ఈ నియామకం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఐడీఈఎస్ అధికారి అయిన ధర్మారెడ్డికి జిల్లా కలెక్టర్ స్థాయి అర్హత లేదని గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. జిల్లా కలెక్టరు, ఆ హోదాకు సమాన అర్హతలున్న వ్యక్తిని ఈవోగా నియమించేలా చూడాలన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈవోగా ధర్మారెడ్డిని నియమించేందుకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవిచేసినా సరిపోతుందని, ఈ పిటిషన్ కొట్టివేస్తున్నామని కోర్టు తెలిపింది.
Read Also: Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!