Ayyanna Patrudu Issue: అయ్యన్నకి ఊరట…కూల్చివేతలపై హైకోర్ట్ స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత పై హైకోర్టు స్టే విధించింది. అయ్యన్న ఇంటి కూల్చివేత పై ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. అర్థరాత్రి వాదనలు ముగిశాయి.జలవనరుల శాఖ గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు.
దీంతో వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ అయ్యన్న ఇంటి దగ్గర కూల్చివేతపై స్టే విధించింది హైకోర్ట్. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇంటి జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇల్లు కూల్చివేతపై హౌస్ దాఖలు చేసిన మోషన్ పిటిషన్ పై అయ్యన్నపాత్రుడు తరుపున వాదనలు వినిపించారు న్యాయవాది సతీష్. దీంతో నర్సీపట్నంలో నెలకొన్న హై డ్రామాకు తెరపడింది. గోడ కూల్చివేతకు వచ్చిన జేసీబీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
మరోవైపు బీసీలపై దాడులను, హత్యలను నిరసిస్తూ సోమవారం ఛలో నర్సీపట్నం కార్యక్రమం చేపడతామని ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అనేక మంది బలహీన వర్గాల నాయకులపై ఈ ప్రభుత్వం దాడులు చేసింది. ఇప్పటివరకు 26 మంది బీసీ నేతలను హత్య చేశారు వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించిన బీసీ నాయకులే టార్గెట్ గా వారిపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమను నిలదీయటానికి అందరూ నర్సీపట్నంకి తరలి రావాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!