MLA Prakash Reddy: రాప్తాడులో పరిటాల గెలవాలంటే నన్నైనా, నా క్యారెక్టర్ నైనా చంపాలి.. అందుకే ‘జాకీ’ ఇష్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prakash Reddy: అనంతపురం రాజకీయాల్లో ఇప్పుడు ‘జాకీ’ పరిశ్రమ హీట్ పెంచుతుంది… ఈ విషయంపై తాజాగా సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.. రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో పేర్కొన్న రామకృష్ణ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తరలిపోయినట్లు ఆరోపించారు.. పారిశ్రామికవేత్తలను ప్రజాప్రతినిధులు బెదిరిస్తే పరిశ్రమలు ఎలా ఏర్పాటు అవుతాయి? అని ప్రశ్నించారు రామకృష్ణ.. అయితే, ఆ ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. చంద్రబాబు, రామకృష్ణ కళ్లున్న కాబోదులని ఫైర్ అయ్యారు.
Read Also: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్కు లేఖ.. ఆ ఎమ్మెల్యే వల్లే ‘జాకీ’ పరిశ్రమ వెనక్కి..!
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
2018 డిసెంబర్లో రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ సేలంకు తరలిపోయింది.. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించ లేదు అంటూ రామకృష్ణను నిలదీశారు ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి.. ఆరోజే చంద్రబాబు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎందుకు తిట్టలేదన్న ఆయన.. పరిటాల వారు గుడ్ విల్ అడిగినందుకే అప్పుడు పరిశ్రమ పోయిందని ఆరోపించారు.. కమ్యూనిస్టు భావాలను పక్కన పెట్టి.. అమ్ముడుపోయారు అంటూ రామకృష్ణపై ఫైర్ అయ్యారు. ఇక, రాప్తాడులో పరిటాల వారికి డిపాజిట్ రావని.. ధర్మవరం, పెనుకొండ చూస్తున్నారని.. కానీ, చంద్రబాబు వాళ్లను రాప్తాడు తిరిగి పంపారని.. రాప్తాడులో పరిటాల వాళ్లు గెలవాలంటే నన్నైనా చంపాలి.. నా క్యారెక్టర్ నైనా చంపాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కమ్యూనిస్టులు అండగా ఉంటారని చంద్రబాబు చెప్పారు.. ఇప్పుడే అందుకే జాకీ పరిశ్రమ ఇష్యూని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, 2018లోనే రాప్తాడు నుంచి తరలిపోయిన జాకీ పరిశ్రమను సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోమూవీర్రాజు వెనక్కి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి.. ఇదే సమయంలో, 10 వేల మంది మహిళలకు ఉపయోగపడే ఉండే విధంగా డైరీ స్థాపిస్తున్నాను అని వెల్లడించారు.. పేజ్(జాకీ) సంస్థ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ.. అనేక రాష్ట్రాల్లో వీరు పెట్టుబడులు పెడుతామని వెనక్కి వెళ్లిపోయారు అని ఆరోపించారు. కాగా, జాకీ పరిశ్రమ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని విపక్షాలు టార్గెట్ చేయగా.. వారిపై కౌంటర్ ఎటాక్కు దిగారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!