Rajat Bhargava: ఏపీలో 840 బార్లకు మాత్రమే పర్మిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బార్ల లైసెన్సుల జారీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు అబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. ఇ-ఆక్షన్ ద్వారా పారదర్శకంగా ఆన్ లైన్ లో వేలం ప్రక్రియ నిర్వహిస్తాం. మొత్తం 840 బార్ లకు మించి అదనంగా ఒక్క లైసెన్సు కూడా జారీ చేయబోం. కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో ఈ బార్లను సర్దుబాటు చేస్తాం. డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు ఏపీలో విక్రయించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం
కింగ్ ఫిషర్ లోనే 9 బ్రాండ్లు ఉన్నాయన్నారు. ఫోస్టర్, హెంకెన్ తదితర కంపెనీలకు ఇతర రాష్ట్రాల్లో సరఫరా ఉంది.. వెంటనే అక్కడ ఆపేసి ఏపీకి ఇవ్వరు. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మద్యం సరఫరాకు సంబంధించి 181 ప్రమాణాల్ని పాటిస్తుంది. ఆదాయం, కొనుగోళ్లు, వేలం తదితర అంశాలపై త్వరలోనే అన్నీ వెబ్ సైట్ లో ఉంచుతాం. మద్యానికి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యపానం గణనీయంగా తగ్గిందన్నారు రజత్ భార్గవ. రాష్ట్రంలో సేవించే మద్యాన్ని కెమికల్ ల్యాబ్స్ లో పరీక్షించాకే అనుమతి ఇస్తాం.
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ఎక్కువ సంఖ్యలోనే నమూనాల్ని పరీక్షించిన తర్వాత విక్రయానికి అనుమతిస్తున్నాం. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లో పారదర్శకత కోసం అంతర్గత ఆడిట్ , బయటి ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. త్వరలోనే కార్పోరేషన్ బోర్డులో చార్టెడ్ అకౌంటెంట్ తో పాటు రెండు స్వతంత్ర డైరెక్టర్లను కూడా నియమిస్తాం. బోర్డులో ఓ మహిళా డైరెక్టర్ కూడా నియమించాలని భావిస్తున్నాం అని తెలిపారు రజత్ భార్గవ.
మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాసిన నాటకం ప్రదర్శన వుంటుందన్నారు రజత్ భార్గవ. జూలై 17 తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ రాసిన నాటకాన్ని కళాకారులు ప్రదర్శిస్తారు.1803లో బ్రిటీషర్లతో ఓడిశాలోని స్వాతంత్ర్య సమరయోధుడు బక్సీ జగబంధు చేసిన పోరాటంపై నాటకం రాసిన నాటకం.మహా సంగ్రామర్ మహా నాయక్ పేరిట నాటకాన్ని రాసిన గవర్నర్ బిశ్వభూషణ్.ఒడియా భాషలోనే నాటక ప్రదర్శన దానికి అనుగుణంగా అనువాద ప్రక్రియ వుంటుందన్నారు రజత్ భార్గవ.
Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!