Minister Roja: సచివాలయానికి తాళం..మంత్రి రోజాకు తప్పని నిరసన సెగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీమంత్రి ఆర్ కె రోజాకు ఇంటిపోరు తప్పడం లేదు. స్వంత పార్టీనేతలే ఆమె ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరోసారి నగరిలో రోజాకు నిరసన సెగ తగిలింది. నగరి నియోజకవర్గం అధికార వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. సాయంత్రం నాలుగు గంటలకు వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించాల్సి ఉంది. అయితే అక్కడి నేతలు తమ నిరసన తెలిపారు.
Read Also: Bhakthi tv Koti Deepotsavam: 13వ రోజుకి కోటిదీపోత్సవం.. ఈరోజు విశేష కార్యక్రమాలు
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
సచివాలయానికి తాళం వేశారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ తాళం వేశారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. కేవలం మంత్రి రోజాను అడ్డుకోవడం కోసమే వ్యతిరేక వర్గం చేస్తున్నటువంటి పనిగా చెబుతున్నారు రోజా వర్గం. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల పైన మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేస్తూనే వున్నారు. దీనిపై హైకమాండ్ కి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఇలాగే ఉంటే రాజకీయం చేయలేమంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మంత్రి రోజా 2014, 2019 ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి రెండో సారి గెలుపొందారు.
ఆ సమయంలోనే రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసిందంటారు. ఆమెని ఎలాగైనా ఓడించాలని ఆ వర్గం పావులు కదిపింది. అయితే, నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం 2019 కంటే ఇప్పుడే బలంగా మారిందని అంటున్నారు. మంత్రి రోజాకు సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో, 2024 ఎన్నికల్లో నగరిలో రోజా గెలవాలంటే ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీ నేతల పైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని కామెంట్లు వినబడుతున్నాయి. పర్యటనకు రాకుండానే వ్యతిరేక వర్గం నిరసన తెలపడంపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also:Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్కి.. కలిసొస్తున్న కాలం..
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!