Pathipati Pullarao: దొడ్డిదారిలో ఎంపీపీ సీటుని వైసీపీ కొట్టేసింది
దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం సాగిన ఈ పోరు, ఎట్టకేలకు ముగిసింది. ఈ పీఠం వైసీపీకే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. న్యాయబద్దంగా ఈ సీటు తమకు దక్కిందని వైసీపీ నేతలు చెప్తోంటే.. అప్రజాస్వామికంగా వైసీపీ ఈ సీటుని కొట్టేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పత్తిపాటు పుల్లారావు అవే విమర్శలు చేశారు.
దుగ్గిరాల ఎంపీపీ సీటు కోసం వైసీపీ న్యాయస్థానం ఆదేశాల్ని తుంగలో తొక్కి, అప్రజాస్వామికంగా దొడ్డిదారిలో వెళ్ళిందన్నారు. 18 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ-9, జనసేన-1 స్థానాల్ని కైవసం చేసుకున్నప్పుడు.. వైసీపీకి ఎంపీపీ పీఠం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెరవెనుక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సొంత పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేయించి మరీ, ఈ పీఠాన్ని దక్కించుకున్నారన్నారు. న్యాయస్థానం ఆదేశాల్ని పట్టించుకోకుండా ఈ సీటు దోచుకున్న వైసీపీకి ప్రజలు కచ్ఛితంగా గుణపాఠం చెప్పే తీరుతారన్నారు.
Also Read
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
ఇదే సమయంలో విద్యా దీవెన నిధుల్ని సక్రమంగా ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందన్నారు. జగన్ నిర్వాకంతోనే 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. టీడీపీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు రూ.2,132 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ అందగా, జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో కేవలం 10 లక్షల 82 వేల మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. జగన్లో నిరాశ నిస్పృహలు, అసూయ ద్వేషాలు పెరగడం వల్లే ప్రతిపక్షంపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని, ఆయన ప్రభుత్వం ఎంత గింజుకున్నా 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని నమ్మకం వెలిబుచ్చారు.
తాజావార్తలు
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!