Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Sensational Comments On Ap Govt

YS Jagan: మా హయాంలో రైతురాజ్యం.. ఇప్పుడు కష్టాల్లో రైతులు

Published Date :June 11, 2025 , 1:11 pm
By Chandra Shekhar Pamena
  • రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు..
  • ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు..
  • రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి..
  • రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
  • మా హయాంలో రైతురాజ్యం నడిచింది: వైఎస్ జగన్
YS Jagan: మా హయాంలో రైతురాజ్యం.. ఇప్పుడు కష్టాల్లో రైతులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: ప్రకాశం జిల్లాలోని పొదిలిలోని పొగాకు బోర్డు దగ్గరకు వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్.. పొగాకు రైతులను పరామర్శించి వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. రైతులను అడిగి పొగాకు కొనుగోలు రేట్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Read Also: Sonam Raghuwanshi: 2 వారాలు గడుస్తున్న దొరకని రాజా మొబైల్.. బెంగళూరు టు మేఘాలయ మిస్టరీ అందులోనే!

ఇక, వరి, మిర్చి, పొగా పంట చూసినా గిట్టుబాటు ధర లేదు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చాం.. పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించాం అని సూచించారు. గత ఏడాది రైతు భరోసా కింద ఇస్తున్న సొమ్ము ఆగిపోయింది.. మోడీ ఇచ్చే ఆరు వేలు కాక.. మరో 20 వేలు ఇస్తామని చెప్పారు.. జూన్ వచ్చినా ఇంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదని ఆరోపించారు. ఇక, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ అందించే వాళ్ళం.. ఆర్బీకేలతో ఉచిత పంటల బీమా అందించాం.. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ ఆరోపణలు చేశారు.

Read Also: Vangalapudi Anitha: కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్నిన హోంమంత్రి..

అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతీ రైతుకు ఎకరాకు అదనంగా 10 వేలు ఇచ్చే వాళ్ళం.. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం.. కేంద్రం ప్రకటించిన పంట్కే కాకుండా పలు పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించాం.. ఏ పంటకైన గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకుని కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది.. పొగాకు పంటకు గత ఏడాది కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం పొగా రైతులను పట్టించుకుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap govt
  • chandrababu
  • NDA Govt
  • pawan kalyan

తాజావార్తలు

  • Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

  • Islamabad: ఇరాన్-అమెరికా చర్చల వేళ ఇస్లామాబాద్‌లో హై-టెన్షన్.. భారీగా కమాండోలు మోహరింపు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions