Janasena Vs TDP Flex War: జనసేన వర్సెస్ టీడీపీ..! ఒంగోలులో ఫ్లెక్సీల రగడ
- ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ..
- బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు..
- ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఫొటోలు..
- ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టడంపై టీడీపీ అభ్యంతరం..
Janasena Vs TDP Flex War: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ మొదలైంది.. ఒంగోలు చర్చి సెంటర్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, వాళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు.. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను తొలగించారు.. బాలినేని వంటి నేతలు గతంలో తమను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు జనసేనకు వస్తున్నారని ఆరోపించారు.. బాలినేని పార్టీ మార్పు వ్యవహారంలో తమ నేతల అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికలకు ముందు జనసేనలోకి వచ్చిన వారిని స్వాగతిస్తామని.. ఇప్పుడు వచ్చే వారు మీ ఇష్టానుసారం చేయాలని చూస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు.
Also Read
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
- Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి
కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాలతో పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.. రాజకీయాలు వేరు.. బంధుదుత్వాలు వేరంటూ లేఖలో ఘటు వ్యాఖ్యలు చేసిన బాలినేని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు… ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీంతో ఆయన దాదాపుగా వచ్చే 4వ తేదీన ఒంగోలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తన అనుచరులతో పాటు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు..
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!