భారీగా గుట్కా, ఖైనీ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు గుంటూరు రూరల్ పోలీసులు. 97లక్షల 72వేల విలువైన గుట్కా నిల్వలను పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురి నిందితులను అరెస్టు చేసారు. వారం రోజులుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ గుట్కా ర్యాకెట్ కేసు వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ… బెంగళూరుకు చెందిన తయారీదారు సిద్ధప్ప గుట్కా ర్యాకెట్లో కీలక పాత్రధారిగా గుర్తించాం అన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో 8 జిల్లాల్లోకి గుట్కా సరఫరా జరుగుతోంది. కర్ణాటక, రాజస్థాన్ నుంచి గుట్కా ర్యాకెట్ నడుస్తోంది. రెండు బృందాలు రెండు రాష్ట్రాల్లో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాయి. నిషేధిత గుట్కా విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా అందించాలని ఎస్పీ విశాల్ విజ్ఞప్తి చేసారు.