కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. స్టేషన్కు ఇటీవల కాలంలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు శాంతి పూజలు నిర్వహించడం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులందరూ కలిసి అర్చకుల చేత విశేష పూజలు చేయించడంతో.. ఇలా ఎందుకు చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చే కేసులను తగ్గించడానికి అంటూ పోలీసులు సమాధానం చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు విశేష పూజల సందర్భంగా అర్చకులు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో గోమూత్రం చల్లారు. కొన్ని వారాలుగా కేసుల సంఖ్య పెరగడంతో పాటు డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శాంతి పూజలు చేయిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని కొందరు చెప్పడంతో పోలీసులు స్టేషన్ ఆవరణలో గోమూత్రం చల్లించి శాంతి పూజలు జరిపించారు. అంతేకాకుండా జంతుబలి ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది.