పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైసీపీ ఇంఛార్జి కొండారెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థ కాంట్రాక్టర్ను బెదిరించిన కేసులో కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పులివెందుల-రాయచోటి మధ్య రోడ్డు పనులను కొండారెడ్డి అడ్డుకున్నారని.. చక్రాయపేట మండలంలో పనులు జరగాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా సదరు కన్స్ట్రక్షన్ సంస్థ కర్ణాటకలోని ఓ బీజేపీ నేతకు చెందినదిగా తెలుస్తోంది. దీంతో కొండారెడ్డి బెదిరిస్తున్న విషయాన్ని ఈ సంస్థ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతోనే పోలీసులు తక్షణమే స్పందించినట్లు సమాచారం. కాగా ఈ కేసులో వైసీపీ నేత కొండారెడ్డి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతరం నిందితుడిని లక్కిరెడ్డిపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
Nara Lokesh: జగన్ గారూ.. నిన్నటి సూసైడ్.. నేడు రేప్గా ఎలా మారింది?