Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pm Narendra Modi To Visit Vizag On November 11th

PM Narendra Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ..

Published Date :October 26, 2022 , 9:23 am
By Sudhakar Ravula
PM Narendra Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చే నెలలో ఆయన విశాఖలో పర్యటించనున్నారు.. నవంబర్‌ 11వ తేదీన విశాఖ‌ రానున్న ఆయన.. రూ.400 కోట్లతో విశాఖలో చేపట్టనున్న రైల్వే న‌వీక‌ర‌ణ ప‌నులకు శ్రీకారం చుట్టనున్నారు.. రైల్వే న‌వీక‌ర‌ణ ప‌నులతో పాటు.. ప‌లు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు భారత ప్రధాని… ఈ అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు.. మరోవైపు.. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. అయితే, ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఆసక్తికంగా మారింది..

Read Also: Astrology : అక్టోబర్‌ 26, బుధవారం దినఫలాలు

విశాఖ కేంద్రంగా ఇప్పటికే రాజకీయం రసవత్తరంగా సాగుతోంది… ఓవైపు మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది.. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి తీరుతాం అంటోంది.. మరోవైపు.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర కూడా చేస్తున్నారు.. ఇప్పటికే అమరావతి రాజధానికే తమ సపోర్ట్‌ అని బీజేపీ స్పష్టం చేయగా.. ప్రధాని విశాఖ పర్యటన ఆసక్తికంగా మారిపోయింది.. ఇక, తన పరట్యనలో ఏపీ బీజేపీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మోడీ… ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం అదే రోజున ప్రధాని మోడీతో భోగాపురం విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయించే విధంగా పీఎంవోకు ప్రతిపాదనలు పంపింది… ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. విశాఖ రైల్వే జోన్‌పై రకరకాల పుకార్లు సాగుతున్నాయి.. విశాఖ రైల్వే జోన్ వచ్చే అవకాశం లేదని కొందరు అంటుంటే.. అదే జరగకపోతే.. రాజీనామాకు సిద్ధంమని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రకటించారు..

అయితే, తన పర్యటనలో ప్రధాని మోడీ.. వివాఖ రైల్వే జోన్‌పై క్లారిటీ ఇస్తారనే అంచనాలున్నాయి.. దీంతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు పైనా ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన.. ఆ వెంటనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. మంత్రుల కాన్వాయ్‌లపై రాళ్ల దాడి చేసినట్టు ఆరోపణలు రావడం.. జనసేన నేతలపై కేసులు పెట్టడం లాంటి చర్యలతో విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఇక, ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం. కాగా, జులైలోనే ఏపీలో పర్యటించారు ప్రధాని మోడీ.. జులై 4వ తేదీని ఏపీకి వచ్చిన ఆయన.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా..! అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • CM YS Jagan
  • PM Narendra Modi
  • PM Narendra Modi Vizag Tour

తాజావార్తలు

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions