PennaAhobilam Pilgrims Rush: పెన్నాఅహోబిలంలో భక్తుల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా తుంగభద్ర జలాలు ఏపీ వైపు పరుగులు తీస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయం ప్రక్కనే తుంగభద్ర జలాల రాకతో జలకళ సంచరించుకుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పెన్నా అహోబిలంకు తరలి వస్తున్నారు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు జలాల సవ్వడి భక్తులను ఆకట్టుకుంటోంది.
తుంగభద్ర జలాలు పక్కనే ఉన్న కాల్వ ద్వారా మిడ్ పెన్నార్ జలాశయం పోతుడడంతో జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర డ్యాం ఇప్పటికే నిండిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో తుంగభద్ర జలాలను కిందికి విడుదల చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉరవకొండ మండలం మోపిడి లింకు ఛానల్ 189 కిలోమీటర్ వద్ద 450 కుసెక్కుల నీటిని మిడ్ పెన్నార్ జలాశయం మళ్లించారు అధికారులు. దీంతో తుంగభద్ర జలాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే పరవళ్లు తొక్కుతూ వెళుతున్నాయి.
Also Read
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
Monkeypox: కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం!
పెన్నా అహోబిలం వద్ద నీటి ప్రవాహం అలలు పచ్చని చెట్లు మధ్య సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న కోనేరు లోకి, చెట్లు మొదళ్ళు క్రింద జలాలు వస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తుంగభద్ర జలాలు రాకతో జలకళ సంచరించుకుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి కర్నాటకలోని బళ్ళారి నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పెన్నా అహోబిలం రావడానికి ఇటు అనంతపురం నుంచి ఉరవకొండ, బళ్ళారి వెళ్లే బస్ లు,ఉరవకొండ నుంచి 15 నిమిషాలు ఒక బస్ నడుపుతున్నారు అధికారులు.
Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!