Perni Nani: చంద్రబాబుపై ఎన్టీఆర్ పగ తీర్చుకోబోతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇదంతా పాత కాలపు స్వామిజీల తంతులా ఉందని.. అసలు చంద్రబాబుకు మైండ్ ఉందా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారని పేర్కొన్నారు.
మొన్నటి వరకు బాదుడే బాదుడు అన్నాడని.. హెరిటేజ్లో రేట్లు బాదుడే బాదుడు అని జనాలకు తెలియదా అని పేర్ని నాని చురకలు అంటించారు. చంద్రబాబును, లోకేష్లను చంపేందుకు కుట్ర జరుగుతోందట.. అసలు ఆయన్ను చంపాల్సిన అవసరం తమకేంటని నిలదీశారు. కాంతారావు సినిమా డైలాగులు ఇప్పుడూ వేస్తే ఎలా చంద్రబాబు? అని ఫైర్ అయ్యారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు, పవన్ కలిసి భోరు భోరున ఏడ్చారని.. ఇప్పుడేమో చంద్రబాబు తనకు అధికారం ఇస్తే ఈ పథకాలన్నీ కొనసాగిస్తాను అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంపద అంతా జగన్ దోచి పెడుతున్నాడని చెప్పారని.. ఇప్పుడు ఇవే పథకాలను తాను కూడా అమలు చేస్తానని చెప్పడం దేనికి సంకేతమన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల్లో నెట్టేస్తున్నాడని కూడా ఆరోపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి వచ్చే ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు వస్తాయని పేర్ని నాని జోస్యం చెప్పారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
Read Also: Bandi Sanjay: రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. మీకు అండగా మేమున్నాం
2004కు ముందు రైతులకు ఉచిత కరెంటు ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నాడని.. వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇవ్వగానే తాను కూడా ఇస్తానని చెప్పుకున్నాడని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు అద్దం ముందు నిలబడి నాకు ఇదేం ఖర్మరా అనుకోవాల్సిందేనని.. 2014 నుంచి 2019 వరకు తాను చేసిన పరిపాలన మళ్ళీ తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేక పోతున్నాడని ప్రశ్నించారు.చంద్రబాబు ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆరో రోజే మ్యానిఫెస్టో కనిపించకుండా మాయం చేశాడని.. టీడీపీ వెబ్సైట్లో మ్యానిఫెస్టో కనిపించకుండా చేశాడని పేర్ని నాని ఆరోపించారు.
తాజావార్తలు
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!