Perni Nani: జగన్పై నిజంగానే వ్యతిరేకత ఉంటే మీకెందుకు భయం..?
విపక్షాల అఖిలపక్ష సమావేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని.. సీఎం వైఎస్ జగన్పై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎందుకు మీ అందరికీ భయం? కలిసి ఎందుకు పోరాటం చేయాలనుకుంటున్నారు? అంటూ నిలదీశారు.. చంద్రబాబు ఏ డ్యాన్స్ వేయమంటే ఆ డ్యాన్స్ వేస్తారు సీపీఐ రామకృష్ణ.. ఎక్కడ చిందు వేయమంటే అక్కడ వేస్తారు.. నారాయణ, రామకృష్ణ, వంటి కుహనా మేధావులు అందరూ చంద్రబాబు పక్కన చేరారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీతో కుమ్మక్కై మీరందరూ ఎన్ని కుట్రలు చేసినా అన్నీ ఛేదించుకుని వచ్చారు జగన్ అని పేర్కొన్న ఆయన.. మీ ధర్నాలకు వైసీపీ చిన్న కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదన్నారు. జీతాలు ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి.. జీతాలు రాకపోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు.. కోర్టు మొట్టి కాయలు వేసినా జనసేనకు బుద్ధి రావటం లేదని సెటైర్లు వేసిన ఆయన.. జగన్ ను తిట్టడానికి ప్రతి ఆదివారం ఒక అడ్డ గాడిద వస్తోంది.. అడ్డ గాడిదలకు కూడా వాక్ స్వాతంత్రం ఉన్నట్లేగా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Minister Kottu Satyanarayana: ఉనికి కోసమే టీడీపీ ఆరాటం.. పార్టీ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం..!
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే భయాన్ని చంద్రబాబులో కలిగించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు పేర్నినాని.. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న కొంతమంది సమావేశం పెట్టుకున్నారు.. రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు.. నిజంగా వాక్ స్వాతంత్రం లేకపోతే మీరిలా మీటింగ్ పెట్టుకోగలరా? అని నిలదీశారు. మూడేళ్లుగా అసభ్యకరమైన భాషలో అనేక వేదికలపై నుంచి మాట్లాడుతూనే ఉన్నారుగా..! జనం జగన్ కు ఓటు వేసి తప్పు చేశారని అచ్చెన్నాయుడు అంటున్నాడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు టీడీపీ పారిపోయింది? అని ప్రశ్నించారు. పేద వర్గాలకు 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టులం అని చెప్పుకోవటానికి రామకృష్ణ లాంటి వాళ్ళు సిగ్గు పడాలన్నారు. మీ లాంటి నాయకులను చూసి కార్యకర్తలు బాధపడుతూ ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.
తాజావార్తలు
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!