Perni Nani: అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు.. కనీసం టీడీపీ వాళ్లు కూడా పాల్గొనడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు సంధించారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరి పొట్ట కొట్టి డబ్బున్నోళ్లకు పెడుతున్నాడని మండిపడ్డారు. అమరావతి యాత్రలో ఎవరూ రైతులు లేరని.. చంద్రబాబు మనుషులే ఉన్నారని పేర్ని నాని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు కనీసం తమ కండువాలు కప్పుకుని ఈ యాత్రలో పాల్గొనే స్థితిలో కూడా లేరని ఎద్దేవా చేశారు. చాలా మంది టీడీపీ కార్యకర్తలు అమరావతి పాదయాత్రలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ఎన్టీఆర్ను ఎంత మానసిక క్షోభకు గురిచేశారో తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీ నుంచి ఎన్టీఆర్ను సస్పెండ్ చేయడమే కాకుండా అసెంబ్లీలో చివరిసారిగా మాట్లాడతాను అని చెప్పినా వినకుండా మార్షల్స్ను పెట్టి గెంటాడని పేర్ని నాని విమర్శలు చేశారు.
Read Also:VijayaSaiReddy: రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు.. విజయసాయిరెడ్డి సెటైర్లు
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
అటు అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. అయితే గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. గుడివాడ శరత్ థియేటర్ వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్ కొడాలి నానికి చెందినది కావడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది. అటు అమరావతి రైతుల పాదయాత్ర శరత్ థియేటర్ మీదుగానే వెళ్లనుంది. మరోవైపు గుడివాడలో పోలీస్ ఆంక్షలు ఉన్నాయని జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. 600 మందితో యాత్ర చేసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమరావతి రైతులు పాటించాలని సూచించారు. బాధ్యతారహిత్యంగా వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా హెచ్చరించారు.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!