Perni Nani: అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు.. కనీసం టీడీపీ వాళ్లు కూడా పాల్గొనడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు సంధించారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరి పొట్ట కొట్టి డబ్బున్నోళ్లకు పెడుతున్నాడని మండిపడ్డారు. అమరావతి యాత్రలో ఎవరూ రైతులు లేరని.. చంద్రబాబు మనుషులే ఉన్నారని పేర్ని నాని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు కనీసం తమ కండువాలు కప్పుకుని ఈ యాత్రలో పాల్గొనే స్థితిలో కూడా లేరని ఎద్దేవా చేశారు. చాలా మంది టీడీపీ కార్యకర్తలు అమరావతి పాదయాత్రలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ఎన్టీఆర్ను ఎంత మానసిక క్షోభకు గురిచేశారో తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీ నుంచి ఎన్టీఆర్ను సస్పెండ్ చేయడమే కాకుండా అసెంబ్లీలో చివరిసారిగా మాట్లాడతాను అని చెప్పినా వినకుండా మార్షల్స్ను పెట్టి గెంటాడని పేర్ని నాని విమర్శలు చేశారు.
Read Also:VijayaSaiReddy: రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు.. విజయసాయిరెడ్డి సెటైర్లు
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
అటు అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. అయితే గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. గుడివాడ శరత్ థియేటర్ వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్ కొడాలి నానికి చెందినది కావడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది. అటు అమరావతి రైతుల పాదయాత్ర శరత్ థియేటర్ మీదుగానే వెళ్లనుంది. మరోవైపు గుడివాడలో పోలీస్ ఆంక్షలు ఉన్నాయని జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. 600 మందితో యాత్ర చేసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమరావతి రైతులు పాటించాలని సూచించారు. బాధ్యతారహిత్యంగా వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా హెచ్చరించారు.
తాజావార్తలు
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!