Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Wants Vizag Steel Plant Should Be Owned By The Central Government: తెలుగువారి భావోద్వేగాలతో పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ ముడిపడి ఉందని.. 32 మంది ప్రాణ త్యాగాలతో, ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా ఈ పరిశ్రమ సిద్ధించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంతటి ఘన నేపథ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలని తమ జనసేన పార్టీ ఆకాంక్షిస్తోందని అన్నారు. ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ప్రకటన వచ్చినప్పుడు.. తాను వెంటనే ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనాయకత్వంతో కలిసి చర్చించానని, దీనిపై వారు సానుకూలంగానే స్పందించారని తెలియజేశారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిందన్నారు.
Ravi Shastri: టీమిండియాకి మరో యువ సంచలనం దొరికాడు.. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాని కలిసి.. విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న బంధాన్ని తెలియచేసి, ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని తాను కోరానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని, దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని ప్రకటన చేయడం హర్షణీయమని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని.. ఇందులో కొందరికి ఇప్పటివరకూ సెటిల్మెంట్ కాలేదని చెప్పారు. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. కానీ వారికి మొదటి నుంచి చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి.. రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని, కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశామన్నారు. అయినా దానిపై వైసీపీ పాలకులు స్పందించలేదని మండిపడ్డారు.
Chennai Super Kings: చెన్నై మరో ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్
జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు.. విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొన్ని రోజుల కిందట పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించిందన్నారు. దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప.. పరిశ్రమను కాపాడుతామనే మాట చెప్పలేకపోయారని ఫైర్ అయ్యారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదని ఆరోపించారు. ఈ క్రమంలో.. ఇప్పటికిప్పుడే ఈ పరిశ్రమని ప్రైవేటుపరం చేయడం లేదని కేంద్రమంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందన్నారు. జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోందన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా.. విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!