Election Alliance: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Alliance:రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు ఇష్టంలేకున్నా.. కొందరితో కలిసి వెళ్లాల్సి వస్తుందన్న ఆయన.. అయితే మనకు గౌరవం తగ్గకుండా ఉంటేనే కలిసి ముందుకు సాగుతామని.. లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.. ప్రజలంతా మద్దతు ఇస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాను.. కానీ, తనకు ఆ నమ్మకం కలగాలి.. క్షేత్రస్థాయిలో మీ నుంచి మద్దతు లభిస్తే ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధం అయ్యాను. ఇక, ఒంటరిగా గెలిస్తే పొత్త ఎందుకు పెట్టుకుంటానని అన్నారు పవన్… ఇప్పుడు తన దగ్గర ఉంటారని.. ఎన్నికలు రాగానే తన వాడు తన కులం వాడు అని వెళ్లిపోతారని అన్నారు. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందటం అవసరమా ? అని పరోక్షంగా పొత్తులతో ముందుకు సాగుతానని సంకేతాలు ఇచ్చారు జనసేనాని.. ఈ ఎన్నికలు చాలా కీలకం.. నేను ముఖ్యమంత్రిగా చేయాలంటే అది మీ చేతిలోనే ఉందన్నారు.. అధికారం ఇస్తే సేవకుడిలా ఉంటా.. లేకపోతే అలానిలబడతానని ప్రకటించారు పవన్..
Read Also: Pawan Kalyan: ఇది మూడు ముక్కల సర్కార్.. ఆయన మూడు ముక్కల సీఎం..
Also Read
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
నేను ఒక్క కులానికి కాపు కాయను .. నాకులాని ఎంత గౌరవం ఇస్తానో మిగిలిన అన్ని కులాలకు అంతేగౌరవం ఇస్తానని స్పష్టం చేశారు పవన్.. వచ్చే ఎన్నికలలో ఓట్లు చీలకూడదు. ఒంటరిగా వెళ్లడానికి నేను సిద్ధమే.. భయపడే వ్యక్తిని మాత్రం కాదన్నారు.. గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళ్దాం.. లేదంటే ఒంటిరిగా పోదాం.. కానీ, మీరు క్షేత్రస్థాయిలో బలం కలిగిస్తే నేను ఒంటరిగానే వెళ్తానన్నారు.. సభలో ఒక మాట అంటూ ఇంటికెల్లి ఎన్నికలలో మారిపోతున్నారన్న ఆయన.. మనకి పడని శత్రువులు ఉంటే అందరం కలసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు..
వారాహితో వస్తా.. ఎవడాపుతాడో నేను చూస్తా నంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్.. ఒంటరిగా లేదా మిశ్రమంగా ప్రభుత్వం వస్తుందనే వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రభుత్వం వస్తే ఉత్తరాంధ్ర వలసలు ఆపుతాం.. పరిశ్రమలు తీసుకువస్తాం.. వలసలు మాటపోయి ఆర్థికరాజధాని చేస్తాం అన్నారు.. మూడు కులాల చుట్టూనే రాజకీయాలు ఎందుకు తిరగాలి…? అని ప్రశ్నించారు.. ఆ పద్ధతి మారాలి అన్నారు. జనసేన ప్రభుత్వమా..? మిశ్రమ ప్రభుత్వమా..? ఏది అధికారంలోకి వచ్చిన స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం అన్నారు.. యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయంగా మార్చిన వాళ్లను దోషులుగా పరిగణిస్తున్నాం అన్నారు పవన్.. వాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరించారు.. వచ్చే ఎన్నికలు కీలకం… రోడ్లు మీదకు ఎక్కుతాం.. మీ ఒంటి మీద దెబ్బ పడితే నేను అడ్దుగా నిలబడతానని భరోసా కల్పించారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!