Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పొలిటికల్ క్యారక్టర్ ఆర్టిస్ట్: అడపా శేషు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే పార్ట్ టైమ్ పొలిటికల్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు ఎద్దేవా చేశారు. కాపులకు ఏం కావాలో అవన్నీ సీఎం జగన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. కాపునని చెప్పుకోలేని ఆయన కూడా కాపుల గురించి మాట్లాడుతున్నాడని దెప్పిపొడిచారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్దే అయినా నడిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ అని తెలిపారు. పక్కనే ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వెయ్యని పవన్కి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.
చంద్రబాబు హయాంలో కాపులు అనేక ఇబ్బందులు పడుతుంటే అప్పుడు ఈయన ఏమయ్యాడని అడపా శేషు నిలదీశారు. “పవన్ నిత్యం కుల, మత రాజకీయాలు చేస్తున్నాడు. జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ప్రభుత్వ పథకాలపై టీడీపీ, జనసేన అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. వెనకబడిన అగ్ర కులాల విద్యార్థుల కోసం జగన్ విదేశీ విద్యా దీవెన పథకంతో వరమిచ్చారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఎక్కువ మందికి ఈ స్కీమ్ వర్తించేలా చర్యలు తీసుకున్నారు.
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
గత ప్రభుత్వం రూ.6 లక్షల వార్షిక ఆదాయ నిబంధన పెడితే దాన్ని సీఎం జగన్ రూ.8 లక్షలకు పెంచారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు. చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. కార్పొరేషన్ పేరుతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. డబ్బున్న పిల్లలు కూడా కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్లారు. కొంత మంది విద్యార్థులు విదేశాలు వెళ్లకుండానే డబ్బు కాజేశారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ కాపు కార్పొరేషన్ను సక్రమంగా నడిపిస్తున్నారు” అని అడపా శేషు వివరించారు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న పైన కూడా అడపా శేషు ఫైర్ అయ్యారు. ఆయన బతుకేంటో విజయవాడలో అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డిని ఏక్నాథ్ షిండే అంటూ బుద్ధా వెంకన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే నాలుక కొస్తామని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..