Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పొలిటికల్ క్యారక్టర్ ఆర్టిస్ట్: అడపా శేషు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే పార్ట్ టైమ్ పొలిటికల్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు ఎద్దేవా చేశారు. కాపులకు ఏం కావాలో అవన్నీ సీఎం జగన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. కాపునని చెప్పుకోలేని ఆయన కూడా కాపుల గురించి మాట్లాడుతున్నాడని దెప్పిపొడిచారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్దే అయినా నడిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ అని తెలిపారు. పక్కనే ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వెయ్యని పవన్కి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.
చంద్రబాబు హయాంలో కాపులు అనేక ఇబ్బందులు పడుతుంటే అప్పుడు ఈయన ఏమయ్యాడని అడపా శేషు నిలదీశారు. “పవన్ నిత్యం కుల, మత రాజకీయాలు చేస్తున్నాడు. జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ప్రభుత్వ పథకాలపై టీడీపీ, జనసేన అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. వెనకబడిన అగ్ర కులాల విద్యార్థుల కోసం జగన్ విదేశీ విద్యా దీవెన పథకంతో వరమిచ్చారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఎక్కువ మందికి ఈ స్కీమ్ వర్తించేలా చర్యలు తీసుకున్నారు.
Also Read
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
గత ప్రభుత్వం రూ.6 లక్షల వార్షిక ఆదాయ నిబంధన పెడితే దాన్ని సీఎం జగన్ రూ.8 లక్షలకు పెంచారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు. చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. కార్పొరేషన్ పేరుతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. డబ్బున్న పిల్లలు కూడా కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్లారు. కొంత మంది విద్యార్థులు విదేశాలు వెళ్లకుండానే డబ్బు కాజేశారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ కాపు కార్పొరేషన్ను సక్రమంగా నడిపిస్తున్నారు” అని అడపా శేషు వివరించారు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న పైన కూడా అడపా శేషు ఫైర్ అయ్యారు. ఆయన బతుకేంటో విజయవాడలో అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డిని ఏక్నాథ్ షిండే అంటూ బుద్ధా వెంకన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే నాలుక కొస్తామని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు హెచ్చరించారు.
తాజావార్తలు
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!