Pawan Kalyan: నాకు పదవి ముఖ్యం కాదు.. పదవి కావాలంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Key Comments in independence day Celebrations: పదవులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పదవే కావాలని కోరుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. ఇష్టానుసారం మాట్లాడే వైసీపీ నేతలకు తాను జవాబు చెప్పగలనని పవన్ అన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసు అని.. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపలేరని ఎద్దేవా చేశారు.
Read Also: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
అటు పార్టీని నడిపేందుకు వైసీపీ నేతలకే అర్హత ఉందా తమకు లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పవన్ విమర్శలు చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు బలంగా మారలేవని అభిప్రాయపడ్డారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ఎలా చెప్తారని పవన్ నిలదీశారు. గుడివాడలో ఇసుక దందా, చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు బనాయిస్తోందని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. భీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని పవన్ చురకలు అంటించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీలు, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడతారో నాకు తెలుసు
వాళ్ల వేషాలు మన దగ్గరే. – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/02WrbOHoCo— JanaSena Party (@JanaSenaParty) August 15, 2022
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!