Pawan Kalyan: నాకు పదవి ముఖ్యం కాదు.. పదవి కావాలంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Key Comments in independence day Celebrations: పదవులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పదవే కావాలని కోరుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. ఇష్టానుసారం మాట్లాడే వైసీపీ నేతలకు తాను జవాబు చెప్పగలనని పవన్ అన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసు అని.. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపలేరని ఎద్దేవా చేశారు.
Read Also: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
అటు పార్టీని నడిపేందుకు వైసీపీ నేతలకే అర్హత ఉందా తమకు లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పవన్ విమర్శలు చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు బలంగా మారలేవని అభిప్రాయపడ్డారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ఎలా చెప్తారని పవన్ నిలదీశారు. గుడివాడలో ఇసుక దందా, చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు బనాయిస్తోందని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. భీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని పవన్ చురకలు అంటించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీలు, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడతారో నాకు తెలుసు
వాళ్ల వేషాలు మన దగ్గరే. – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/02WrbOHoCo— JanaSena Party (@JanaSenaParty) August 15, 2022
తాజావార్తలు
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్కార్న్, కూల్డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!