Pawan Kalyan: నాకు పదవి ముఖ్యం కాదు.. పదవి కావాలంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Key Comments in independence day Celebrations: పదవులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పదవే కావాలని కోరుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. ఇష్టానుసారం మాట్లాడే వైసీపీ నేతలకు తాను జవాబు చెప్పగలనని పవన్ అన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసు అని.. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపలేరని ఎద్దేవా చేశారు.
Read Also: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అటు పార్టీని నడిపేందుకు వైసీపీ నేతలకే అర్హత ఉందా తమకు లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పవన్ విమర్శలు చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు బలంగా మారలేవని అభిప్రాయపడ్డారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ఎలా చెప్తారని పవన్ నిలదీశారు. గుడివాడలో ఇసుక దందా, చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు బనాయిస్తోందని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. భీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని పవన్ చురకలు అంటించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీలు, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడతారో నాకు తెలుసు
వాళ్ల వేషాలు మన దగ్గరే. – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/02WrbOHoCo— JanaSena Party (@JanaSenaParty) August 15, 2022
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!