Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- ఏపీలో భారీ రక్షణ రంగ పెట్టుబడులు
- పుట్టపర్తిలో ఫ్లైట్ టెస్ట్ సెంటర్
- 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు
- డ్రోన్ టెక్నాలజీలో ఏపీకి కొత్త దిశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ను రక్షణ (Defense) , సాంకేతిక (Technology) రంగాల్లో ప్రపంచస్థాయి హబ్గా నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాష్ట్రంలో సుమారు రూ. 15,800 కోట్ల భారీ పెట్టుబడితో రక్షణ, ఏరోస్పేస్ , డీప్ టెక్నాలజీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ‘ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం యుద్ధ విమానం ‘అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్’ (AMCA) ప్రోగ్రామ్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు కేరాఫ్ అడ్రస్గా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,500 మందికి పైగా యువతకు ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా హై-వాల్యూ టెక్నాలజీ రంగాల్లో యువతకు ఉపాధి దొరకడం వల్ల ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం విమానాల తయారీ మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అత్యాధునిక ‘డ్రోన్ ఎకోసిస్టమ్’ను అభివృద్ధి చేయడం ద్వారా డ్రోన్ టెక్నాలజీలో కూడా ఏపీ అగ్రగామిగా నిలవబోతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమైన ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఈ ప్రాజెక్టు మరింత బలాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి సహకరించిన ప్రధాని మోడీకి, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇండస్ట్రియల్ , టెక్నాలజికల్ ప్రగతికి ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ మెగా అడుగుతో ఏపీ రక్షణ రంగ మ్యాప్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతోంది.
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!