YS Jagan: రేపు పల్నాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు..!
- రేపు పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో కుటుంబానికి పరామర్శ..
- జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు..
- పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు మండిపాటు.. జగన్ పర్యటనపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రేపు పల్నాడు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వెళ్లనున్నారు జగన్.. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకుంటారు.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.. అయితే, పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సత్తెనపల్లిలో జగన్ పర్యటించి తీరుతారని స్పష్టం చేశారు వైసీపీ నేతలు.. దీంతో, వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు, రేపు జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు..
Read Also: Rajasaab- Peddi -War-2 : రాజాసాబ్, పెద్ది, వార్-2 టీజర్లు.. ఏది ఎక్కువ..?
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
కాగా, వైఎస్ జగన్ పర్యటనపై వైసీపీ నేతలు జిల్లా పోలీసుల్ని అనుమతి కోరారు.. అయితే, భారీగా జనం వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు .. వైసీపీ నేతలు అడిగిన విధంగా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే రావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది..
Read Also: Donald Trump: ‘‘విరమణ కాదు, ముగింపు కోసం చూస్తున్నాం’’.. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై ట్రంప్..
మరోవైపు, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. తూబాడులో రైతు గోపాలరావు, నాదెండ్లలో రైతు ఆదినారాయణ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని.. పొగాకు మిర్చి సాగుతో నష్టాలతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.. పండిచిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.. మిర్చి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. పొగాకు రైతుల కష్టాలపై పొదిలి పర్యటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కష్టాలను ఎప్పుడైనా ప్రభుత్వం పట్టించుకుందా..? అని నిలదీశారు.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి విడదల రజిని..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!