Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagans Visit To Palnadu District Amid Restrictions And Tensions

YS Jagan Palnadu Tour: ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య సాగిన వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన..

Published Date :June 18, 2025 , 10:13 pm
By Sudhakar Ravula
  • ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన..
  • నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్‌..
  • రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ..
  • ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న జగన్..
  • కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా..? అని జగన్ ప్రశ్న..
YS Jagan Palnadu Tour: ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య సాగిన వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan Palnadu Tour: పోలీసుల వేధింపులతోనే పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఎలక్షన్‌ కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారని జగన్‌ చెప్పారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేశారన్నారు. ఊరు విడిచిపోవాలని, లేదంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని నాగమల్లేశ్వరరావును సీఐ బెదిరించారని జగన్‌ ఆరోపించారు. జూన్4న కౌంటింగ్ మొదలైతే, ఐదో తేదీ రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచారని చెప్పారు. తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించాడని జగన్‌ చెప్పారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడని… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జగన్‌ చెప్పారు.

Read Also: Operation Sindhu: ఇరాన్‌-ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల్లో భారతీయులకు ఊరట.. “ఆపరేషన్ సింధు” ద్వారా భారత్ రక్షణ చర్యలు..

నాగమల్లేశ్వరరావు భార్య, కూతురుకు సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని జగన్‌ ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేసిన వారిలో ఎంతమందిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. సీఐపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిలిచి ఇబ్బంది పెట్టారని జగన్‌ గుర్తు చేశారు. కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొందరు పనిచేస్తున్నారని ఆరోపించారు. లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా.. అని జగన్ ప్రశ్నించారు. అయితే, ఉదయం తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయల్దేరిన జగన్‌… సాయంత్రం సమయానికి రెంటపాళ్ల చేరుకున్నారు. గ్రామంలోకి రాగానే క్రేన్ల సాయంతో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు వైసీపీ నేతలు. ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు జగన్. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read Also: Phone Tapping Case: మావోయిస్టులను పేరు వాడుకుని.. బడా నేతల ఫోన్లు ట్యాప్..!

జగన్‌ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గుంటూరులో జగన్ కాన్వాయ్ వెళ్ళే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి రెంటపాళ్లకు చేరుకున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జగన్‌ కాన్వాయ్‌లోని ప్రైవేట్‌ కారు… ఏటుకూరు రోడ్డులో ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని GGHకు తరలించారు పోలీసులు. అయితే.. దారిలోనే అతను మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అని చెప్తున్నారు పోలీసులు. సత్తనెపల్లి పర్యటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం దగ్గర సొమ్మసిల్లి పడిపోయాడు కార్యకర్త. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • palnadu district
  • Police Restrictions
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions