YS Jagan Palnadu Tour: ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య సాగిన వైఎస్ జగన్ పల్నాడు పర్యటన..
- ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన..
- నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్..
- రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ..
- ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న జగన్..
- కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా..? అని జగన్ ప్రశ్న..
YS Jagan Palnadu Tour: పోలీసుల వేధింపులతోనే పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎలక్షన్ కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని జగన్ చెప్పారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేశారన్నారు. ఊరు విడిచిపోవాలని, లేదంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని నాగమల్లేశ్వరరావును సీఐ బెదిరించారని జగన్ ఆరోపించారు. జూన్4న కౌంటింగ్ మొదలైతే, ఐదో తేదీ రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచారని చెప్పారు. తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించాడని జగన్ చెప్పారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడని… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జగన్ చెప్పారు.
Also Read
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
నాగమల్లేశ్వరరావు భార్య, కూతురుకు సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడిచేసిన వారిలో ఎంతమందిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. సీఐపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచి ఇబ్బంది పెట్టారని జగన్ గుర్తు చేశారు. కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు పనిచేస్తున్నారని ఆరోపించారు. లక్ష్మీనారాయణ పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా.. అని జగన్ ప్రశ్నించారు. అయితే, ఉదయం తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయల్దేరిన జగన్… సాయంత్రం సమయానికి రెంటపాళ్ల చేరుకున్నారు. గ్రామంలోకి రాగానే క్రేన్ల సాయంతో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు వైసీపీ నేతలు. ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు జగన్. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read Also: Phone Tapping Case: మావోయిస్టులను పేరు వాడుకుని.. బడా నేతల ఫోన్లు ట్యాప్..!
జగన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గుంటూరులో జగన్ కాన్వాయ్ వెళ్ళే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి రెంటపాళ్లకు చేరుకున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జగన్ కాన్వాయ్లోని ప్రైవేట్ కారు… ఏటుకూరు రోడ్డులో ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని GGHకు తరలించారు పోలీసులు. అయితే.. దారిలోనే అతను మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అని చెప్తున్నారు పోలీసులు. సత్తనెపల్లి పర్యటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం దగ్గర సొమ్మసిల్లి పడిపోయాడు కార్యకర్త. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయింది.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!