Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Chandrababu Said That The Previous Government Has Destroyed The Entire System

CM Chandrababu: గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది.. నిధులన్నీ మింగేశారు

Published Date :December 31, 2024 , 3:52 pm
By Rajesh Veeramalla
  • గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది- ముఖ్యమంత్రి
  • కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారు- చంద్రబాబు
  • మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా..,
  • నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారు- సీఎం.
CM Chandrababu: గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది.. నిధులన్నీ మింగేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. యలమంద గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆ స్కీం నిర్వహణకు డబ్బులు తెచ్చి పక్కదారి మళ్లించారు.. అనేక స్కీంల డబ్బు దారి మళ్ళిందని చంద్రబాబు తెలిపారు. తాను కష్టపడతానని.. సంపద సృష్టిస్తానని.. ఆ సృష్టించిన సంపాదన పేదవారికి అందిస్తానని చెప్పారు.

Read Also: PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ

ఒకప్పుడు రోడ్లన్నీ గోతులే.. తాను రాగానే రోడ్లన్నీ రిపేర్ చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్రాంతికి ఒక నెల అటూ ఇటూ రోడ్లన్నీ బాగు చేయిస్తానన్నారు. అలాగే.. చెత్త పన్ను తీసివేశానని తెలిపారు. మరోవైపు.. అమరావతిని ఇష్టానుసారం చేశారు.. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు 15 వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిని పట్టాలెక్కిస్తామని చెప్పారు. గతంలో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు.. ఐదు సంవత్సరాల సమయాన్ని వృధా చేశారు.. రాష్ట్రానికి రాజధాని లేని అనాధ చేశారన్నారు. రాష్ట్రంలో
ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. నదుల అనుసంధానంతో ప్రతి ఇంటికి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తామని సీఎం వెల్లడించారు. 80,000 కోట్ల రూపాయలతో నదులు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ఎలమంద గ్రామానికి కూడా పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. జల హారతి కార్యక్రమంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

Read Also: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారు.. తమ ప్రభుత్వం వచ్చాక ఆ అప్పులను తీరుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు.. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. అలాగే..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.. మద్యం పాలసీ, ఇసుక పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. ఇసుక విషయంలో దందాలు ఉంటే క్షమించేది లేదు.. పేదలకు ఇసుక అందకుండా చేస్తే చర్యలు ఉంటాయని అన్నారు. మరోవైపు.. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని నిర్మించాలని సీఎం చెప్పారు. గంజాయి వల్ల నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి.. త్వరలోనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామని అన్నారు. 150 సర్వీసులు ఈ గవర్నెన్స్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తామని చెప్పారు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలన్నారు. తన లాంటి వాడిని కూడా మాచర్లకు రానీయకుండా అడ్డుకున్నారు.. దారి తప్పిన వాళ్ళను చండశాసనుడిగా మారి తాటతీస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య కామెంట్లు పెడుతున్నారు.. అలాంటి వారి తాటతీస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Pensions
  • cm chandrababu
  • NTR Bharosa Pensions
  • NTR Bharosa Pensions Distribution

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions